News
ముఖ్యమంత్రి కి బ్రాహ్మణ సమస్యలు వివరించిన రాష్ర్టబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వెల్లాల మధుసూదన శర్మ
గురువారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు పథకం ద్వారా చేతివృత్తుల వారికి అండగా నిలవడానికి ఎమ్మిగనూరు పట్టణానికి వచ్ఛిన సందర్భంగా ఆపన్నప్రదీపన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు వెల్లాల మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి రాష్ట్రములోని బ్రాహ్మణ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మధుసూదనశర్మ తో మాట్లాడుతూ ఎలాంటి సహాయం బ్రాహ్మణులకు అవసరమవుతుంది అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సమస్యలను ముఖ్యమంత్రి జగనన్నకు వివరిస్తూ ఈబిసి నేస్తం ద్వారా చాలా మంది బ్రాహ్మణ మహిళలకు లబ్ధి చేకూరుతోంది అందుకు జగనన్నకు కృతజ్ఞతలు తెలిపడమే కాకుండా పేద బ్రాహ్మణ యువతులకు వివాహములు జరిపించడం తల్లిదండ్రులకు భారంగా మారిందని అందువల్ల “వేదమాత కల్యాణ వైభవం” అనే పథకము ప్రవేశపెట్టి లక్షా యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేస్తే బాగుంటుందని తెలపడమే కాకుండా బ్రాహ్మణులు ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలు, కర్మలు, చేయాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి కష్టాలను తొలగించడానికి “వేదబ్రాహ్మణ అంతిమయాత్ర ఆసరా ” అనే పేరుతో యాభైవేల రూపాయలు అందించాలని, అలాగే క్రెడిట్ సొసైటీ ద్వారా చేతివృత్తులకు, చిన్న వ్యాపారాలు చేసుకునే బ్రాహ్మణ మహిళలకు లక్షరూపాయలు వడ్డీలేని రుణాలు మంజూరు చేయాలని, కర్నూలు పట్టణములో బ్రాహ్మణులు ఎక్కువగా ఉన్నారు వారు వివాహాలు, కార్తీక బోజనాలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానాకి చాలా ఇబ్బందులు పడుతున్నారని దయచేసి కర్నూలు పట్టణములో బ్రాహ్మణ భవణము నిర్మించాలని మధుసూదనశర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని కోరడం జరిగిందని తెలిపారు.

ముఖ్యమంత్రి జగనన్న సానుకూలంగా స్పందించి ఆయన వ్యక్తిగత కార్యదర్శి చెప్పి మధుసూదన శర్మ ఫోన్ నెంబర్ తీసుకున్నారని మధుసూదన్ శర్మ తెలిపారు. వివరించినంతసేపు శ్రద్ధగా విని సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి కి, ఆదోని వైఎస్సార్ పార్టీ యువనేత వై. జయమనోజ్ రెడ్డి కి ధన్యవాదములు తెలియచేసారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
