News
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని లో క్రికెట్ బెటింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు ఇస్మాయిల్ భాష, శివమూర్తి, పింజరి హుస్సేన్ అను నిర్వాహకులను త్రీ టౌన్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 8 లక్షల 25 వేల 5 వందలు రూపాయల నగదు, 8 సెల్ ఫోన్ లు, 30 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు డి.ఎస్.పి శివ నారాయణస్వామి తెలిపారు.
డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఆదోని ఎమ్మిగనూరు బైపాస్ వద్ద ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకున్నామని తెలిపారు. వీరిని విచారించగా వైజాగ్ కి చెందిన రాఘవేంద్ర చారి హైదరాబాద్కు చెందిన నిసార్ అహ్మద్ వారి కింద ఈ ముగ్గురు పని చేస్తున్నారని ఆదోనిలో బెట్టింగ్ ఆడే వారి నుంచి కలెక్షన్ చేసి పంపిస్తే 5% కమిషన్ వారికి వస్తుందని తెలిపారు. త్వరలో రాఘవేంద్ర చారిని, నిసార్ అహ్మద్ ని పట్టుకుంటామని డిఎస్పి శివ నారాయణ స్వామి తెలిపారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమైండ్ కి తరలించినట్లు తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




