News
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకే క్రీడా పోటీలు
విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3160 గవర్నర్ మాణిక్ ఎస్ పవార్ అన్నారు.
కర్నూలు జిల్లా అదోని స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గ్రామాల నుండి 53 పాఠశాలల దాదాపు 2500 మంది విద్యార్థిని విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కాగడ చేత పట్టుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు కప్పులతో పాటు రోటరీ క్లబ్ సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ క్రీడా పోటీల్లో బాలుర జట్లు ఫుట్బాల్ లో 16 జట్లు, త్రో బాల్ 20 జట్లు, కబడ్డీ 33 జట్లు, డాడ్జ్ బాల్ 12 జట్లు , బాస్కెట్ బాల్ 5, అథ్లెటిక్స్ 41, గర్ల్స్ లో జట్లు, కోకో గర్ల్స్ 22 జట్లు, త్రో బాల్ 20 జట్లు, కబడ్డీ గర్ల్స్ 20 జట్లు, టెన్నికాయిట్ గర్ల్స్ 14జట్లు, అథ్లెటిక్స్ 40 జట్లు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ పోటీలను రోటరీ సభ్యుడు సాబీర్ అహ్మద్ సహాయ సహకారాలు మరియు 60 మంది వ్యాయామ ఉపాధ్యాయుల సహకారం ఎనలేని వని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ నాగరాజు, అసిస్టెంట్ గవర్నర్ భరత్ షా, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఉమేష్ పాయి, కార్యదర్శి నితీష్ గాంధీ, యూత్ ఆఫీసర్స్ అమిత్ గాంధీ, కొల్లి నితిన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరస్పాండెంట్ దైవదినం రెడ్డి, మల్లికార్జున విద్యాలయ కరస్పాండెంట్ సూగురప్ప రోటరీ క్లబ్ సభ్యులు జీవన్ సింగ్, సునీల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బసవరాజు, ప్రశాంత్ గాంధీ, రఘునాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, వికాస్ బండారి, రాయచోటి సుబ్బయ్య, వినోద్ జైన్, డాక్టర్ సైఫుల్ల, విట్టా రాజేష్, విజయ్ చౌదరి, ఇతేష్, వీరేష్ స్వామి, షణ్ముఖ, శివరాం, హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
