News
అబివృద్ది పై సమీక్ష సమావేశం
కర్నూలు జిల్లా ఆదోని , ఆలూరు నియోజక వర్గాల అబివృద్ది పై సమీక్ష సమావేశం ఆదోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సృజన ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి , రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనురు జయరాం , జిల్లా పరిషత్ చైర్మన్ , స్థానిక సంస్థల MLC – Dr మదూసుధన్ , మున్సిపల్ చైర్మన్ శాంత , ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మరియు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఆదోని , ఆలూరు అబివృద్ది కి స్థానిక ప్రజా ప్రతినిధుల నుండి వచ్చిన ప్రతిపాదనల పై చర్చలు జరిగాయని. అందులో భాగంగా ఆదోని లో బైపాస్ నిర్మాణం , ప్రభుత్వ డిగ్రీ కాలేజీ , మైనారిటీ జూనియర్ కాలేజీల్లో ఫ్యాకల్టీ నియామకం, ఆటో నగర్ ఏర్పాటు , SS ట్యాంక్ మరమ్మత్తులు , పలు గ్రామాలకు రోడ్డు , త్రాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రతిపాదన ఇవ్వగా , ఆలూరు నియోజక వర్గం నుండి జింకల పార్కు , గ్రామాలకు త్రాగు నీరు , రోడ్డు సౌకర్యం, అంగన్వాడీ కేంద్రాలు , సంతమార్కెట్ , MRO ఆఫీస్ భవనం , R&B వసతి గృహం , రైతు భరోసా కేంద్రాల నిర్మాణం , ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీస్ , ఆస్పరి మండలంలో పొట్లపాడు వంతెన నిర్మాణం , దేవనకొండ లో మోడ్రన్ స్కూల్ ఏర్పాటు , PHC ల మరమ్మతులు వంటి సమస్యల పై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
