News
త్రాగునీటికై రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు
కర్నూలు జిల్లా ఆదోని మండలం బల్లెకల్ గ్రామంలో తీవ్రమైన తాగునీటి ఎద్దడి నెలకొన్నప్పటికీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు గాని అధికారులు కానీ పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వలన నేటికీ తాగునీటికి నోచుకోవడం లేదని చాలా వీధుల్లో సక్రమంగా నీళ్లు సరఫరా కావడం లేదని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం డివైఎఫ్ఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆదోని మాధవరం రోడ్డు మీద అరగంటసేపు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం సచివాలయాన్ని ముట్టడించినప్పటికీ అధికారులు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటికీ సమస్యను పరిష్కరించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టి త్రాగునీరు అందించాలని లేనిపక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళనలకు ప్రభుత్వం అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ మండల కార్యదర్శి వీరేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే లింగన్న, సిఐటియు మండల అధ్యక్షులు జే రామాంజనేయులు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శ్రీకృష్ణ, ఆటో యూనియన్ నాయకులు ఉరుకుందు ,వీరేష్ ,నాగార్జున, డివైఎఫ్ఐ నాయకులు రమేషు మహిళా సంఘం నాయకులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




