News
కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని టౌన్ శిరిగుప్ప చెక్పోస్ట్ వద్ద వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీ చేయగా ముగ్గురు వ్యక్తులు అక్రమంగా కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 7 బాక్సులు కర్ణాటక మధ్య 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. సిఐ విక్రమ సింహ ఇచ్చిన వివరాల మేరకు తమకు సమాచారం రావడంతో చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా గశేష్ సర్కిల్ కు చెందిన మట్కా బీటర్ యువరాజ్, బబ్బులమ్మ గుడికి చెందిన హనుమన్న మరియు బోయ గేరికి చెందిన వీరేష్ ముగ్గురు రెండు లగేజి బ్యాగ్ లలో 7 బాక్సుల కర్నాటక మధ్యంను తీసుకొని వెళ్తుంటే పట్టుకున్నామని తెలిపారు. వారి వద్ద నుండి 726 -90 ml ఒరిజినల్ ఛాయస్ విస్కీ టెట్రా ప్యాకెట్ల లను స్వాధీనం చేసుకొని వారి ముగ్గురిని అరెస్టు చేసి , కేసు నమోదు పరచి రిమాండ్ కి తరలించామని తెలిపారు.
ఈ దాడుల్లో నందు 1 టౌన్ CI విక్రమసింహ, SI జహీర్ , సిబ్బంది రంగస్వామి, HC వీరా రెడ్డి, సుధీర్ , రంగస్వామి, అయ్యన్న మరియ ముస్తాక్ లు పాల్గొన్నారు.
పోలీసుల విజ్ఞప్తి…
దయచేసి అక్రమ సారాయ్, కర్ణాటక మధ్యం అక్రమ రవాణా , క్రికెట్ బెట్టింగ్, పేకాట ల గురించి
9121101135 నెంబరు కు సమాచారం అందిచవలసిందిగా కోరారు…
సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆదోని 1 టౌన్ సిఐ విక్రమ సింహ తెలిపారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


