Connect with us

News

ఆకస్మిక తనిఖీ చేసిన. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.

Published

on

కర్నూలు జిల్లా. ( ఆంధ్ర – కర్ణాటక బార్డర్ )
◆ జిల్లా సరిహద్దులో ఉన్న క్షేత్రగుడి చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్.
◆ చెక్ పోస్టులలో అప్రమత్తంగా ఉండాలి.
◆ అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

వివరాలు అడిగి తెలుసుకుంటు ఎస్పీ కృష్ణ కాంత్

కర్ణాటక రాష్ట్రంలో మే 10 న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కర్నూలు జిల్లా సరిహద్దు ఆలూరు సర్కిల్ , హాలహార్వి పోలీసుస్టేషన్ పరిధిలోని క్షేత్రగుడి, చింతకుంట చెక్ పోస్టులను జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. చెక్ పోస్టులలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి జిల్లా ఎస్పీ గారు పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. చెక్ పోస్టులలో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో డబ్బు , మద్యం , తదితర వస్తువులు అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

ఎస్పీ కృష్ణ కాంత్ కు సరిహద్దు లు చూపిస్తున్న డిఎస్పి వినోద్ కుమార్
చెక్ పోస్ట్ వద్ద పరిశీలిస్తున్న ఎస్పి కృష్ణ కాంత్

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్
Continue Reading

News

లారీ కింద పడి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

News

వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర  , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే  భోజనం చేశారు.

మహాగౌరి ఫ్యాక్టరీ

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి  కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర  మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్న ఫోటో
మృతుడు మాల రాఘవేంద్ర ఫైల్ ఫోటో
Continue Reading

Trending