విద్యార్థుల ఆట స్థలాలను కాపాడండి DSF, NSUI

కర్నూలు జిల్లా ఆదోని పట్టణం దొడ్డనగేరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లో ఆట స్థలంలో పశువుల హాస్పిటల్  భవనం నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ DSF, NSUI ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు శనివారం వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, NSUI ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు మాట్లాడుతూ ఆదోని మండలం దొడ్డనగేరి గ్రామంలో విద్యార్థుల ఆటస్థలం ( గ్రౌండ్)లో నుంచి పొలాలకు, ఇండ్లకు వెళ్లే రోడ్డు గా మార్చేశారని అంతటితో ఆగకుండా ఆట స్థలంలో వాటర్ ట్యాంక్, షాపుల కోసం చాలా స్థలము ఆక్రమించారని విద్యార్థి సంఘం బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పశువుల హాస్పిటల్ కోసం భవన నిర్మాణం చేపడుతున్నారని ఇలా కట్టుకుంటూ వెళ్తే విద్యార్థులకు ఆట స్థలం ఎక్కడ మిగులుతుందని భవిష్యత్తులో భావితరాల విద్యార్థులకు ఆట స్థలం మిగలదని విద్యార్థి సంఘం నాయకులు ఎన్ ఎస్ యు ఐ జిల్లా కార్యదర్శి బాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో దాదాపుగా 1100 మంది విద్యార్థులు చదువుతున్నరని జూన్ 12 నాటికి పాఠశాలలు ఓపెన్ అయితే విద్యార్థులు ఎక్కడ ఆడుకోవాలని ప్రశ్నించారు. విద్యార్థుల ఆట స్థలాన్ని కాపాడాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసినట్లు విద్యార్థి సంఘం నాయకులు తెలిపారు.