News
సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచే.. మాజీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా సూపర్ సిక్స్ ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు ఇచ్చేటప్పుడు కూటమి నాయకులు కు తెలియదా అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు అవసరమైన విద్య, వైద్యం నిర్వీర్యం చేశారని ఆరోజుల్లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానిని రెండు లక్షల నుంచి 25 లక్షలు వరకు పెంచారు.. కారోణా సమయంలో కూడా నవరత్నాలు అమలు చేసి చూపించారు కానీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని జనాలని మోసం చేశారని తెలిపారు. ఎలక్షన్లో ఓట్ల కోసం సూపర్ సిక్స్ ని వాడుకొని ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని అన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గ్రామ స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి చూస్తున్నాం అన్నారు. ఏ విధంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయిందనిద ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుస్తుందని తెలిపారు. దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని రాష్ట్ర ప్రజలు ఆలోచించి రానున్న ఏ ఎలక్షన్ లో నైనా వారికి బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజల ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


