News
సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచే.. మాజీ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ విలేకరుల సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజుల క్రితం స్వయంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పటం సిగ్గుచేటు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా సూపర్ సిక్స్ ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. హామీలు ఇచ్చేటప్పుడు కూటమి నాయకులు కు తెలియదా అని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు అవసరమైన విద్య, వైద్యం నిర్వీర్యం చేశారని ఆరోజుల్లో దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ తీసుకొని వస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానిని రెండు లక్షల నుంచి 25 లక్షలు వరకు పెంచారు.. కారోణా సమయంలో కూడా నవరత్నాలు అమలు చేసి చూపించారు కానీ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని జనాలని మోసం చేశారని తెలిపారు. ఎలక్షన్లో ఓట్ల కోసం సూపర్ సిక్స్ ని వాడుకొని ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని అన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. గ్రామ స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో బడుగు బలహీన వర్గాల పిల్లలకు స్కూళ్లకు వెళ్లలేని పరిస్థితి చూస్తున్నాం అన్నారు. ఏ విధంగా చూసినా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం అయిందనిద ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుస్తుందని తెలిపారు. దీనిని ప్రజలందరూ గమనిస్తున్నారని రాష్ట్ర ప్రజలు ఆలోచించి రానున్న ఏ ఎలక్షన్ లో నైనా వారికి బుద్ధి చెప్పాలని కోరారు. ప్రజల ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
