News
విమానయాన శాఖ మంత్రి ముందు ఆదోని సమస్యల చిట్టా..

ఆదోనిని జిల్లా చేయాలని డిమాండ్ చేస్తూ, ఆదోనిలో టిడిపి కార్యకర్తలకు జరుగుతున్న అవమానం, అన్యాయం గురించి మంగళగిరిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఫిర్యాదు చేశారు మైనార్టీ పరిరక్షణ సమితి యం.హెచ్.పి.యస్.రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్.
ఆదోని ప్రాంతము కరువు, వలసల వల్ల బీహార్ కంటే బాగా వెనుకబడిన ప్రాంతముగా తయారైందని ఆదోని ప్రజల పట్ల దయాచూపి ఆదోని డివిజన్ ను ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూర్ అహ్మద్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదోని అభివృద్ధి కోసం ఏమేమి చేయొచ్చని మంత్రి ప్రశ్నించరని పారిశ్రామిక అభివృద్ధి వల్ల ఆదోని అభివృద్ధి అయ్యే అవకాశం ఉందని ఆ దిశగా ప్రభుత్వం పని చేయాలని నూర్ అహ్మద్ సూచించామని తెలిపారు. అన్ని విషయాలను జాగ్రత్తగా నోట్ చేసుకొన్న మంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో మాట్లాడి ఖచ్చితంగా ఆదోనికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

అదేవిధంగా ఆదోని టిడిపి పార్టీ కార్యకర్తలు చాలా మంచివారు, అంకితభావంతో పని చేసే ఇలాంటి కార్యకర్తలను దూరం చేసుకోవద్దని,ఆదోనిలో గత పదేళ్లు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే చేతిలో నలిగిపోయారని, ప్రస్తుతం కూటమి ఓట్లతో గెలిచిన బిజెపి ఎమ్మెల్యే పార్థసారధి వైసిపి నాయకులను తమ పార్టీలో చేర్చుకుని వారికే మరలా పనులు ఆదాయ మార్గాలు చూపుతుండడంతో టిడిపి కార్యకర్తలు వరుసగా పదకొండవ సంవత్సరము కూడా ఇబ్బందులు తెలిపారు. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చినా ఆదోని నియోజకవర్గం లో మాత్రం వైసిపి నాయకులదే హవా నడుస్తుందని వైసిపి నుంచి బిజెపిలో చేరిన నాయకులు కొందరు అరాచకాలు సృష్టిస్తూ ఆదోని అభివృద్ధిని అడ్డుపడుతున్నారని. అక్రమ దందాలకు పాల్పడుతున్నారని కాని వారిపై విచారణ జరిపి శిక్షించాలని కేంద్ర మంత్రిని కింజరాపు రామ్మోహన్ నాయుడు ని నూర్ అహ్మద్ విజ్ఞప్తి చేశామన్నారు.
దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మాజీ వైకాపా నాయకుల అరాచకాలు అడ్డుకట్ట వేస్తామని, టిడిపి రాష్ట్ర అధ్యక్షునితో విచారణ జరిపించి టిడిపి కార్యకర్తలకు న్యాయం చేస్తామని, ఆదోని టిడిపి కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, సంతేకుడ్లూరు గ్రామ ఎమ్ .హెచ్ పి.యస్. అధ్యక్షులు సద్దాం హుస్సేన్, గౌరవ సలహాదారు కుబేర స్వామి , షేక్షావలి టిడిపి కార్యకర్తలు తుంబళం మల్లికార్జున మరియు జడే కేశప్ప పాల్గొనినట్లు తెలిపారు.

News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
లారీ కింద పడి బాలుడు మృతి
-
News4 weeks ago
హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష