News
బెంగళూరులో జాతీయ అవార్డు అందుకున్న ఆదోని శ్రీనివాస్
కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన బి. శ్రీనివాస్ సోమవారం బెంగళూరులో సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ నిర్వహించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవ పురస్కారం మేమెంటో లతో పాటు ప్రశంసా పత్రని అందుకున్నారు.
బెంగళూరులో అంబేద్కర్ హాల్లో జరిగిన సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ వారు నిర్వహించిన జాతీయ సేవ పురస్కారం కార్యక్రమనికి దేశవ్యాప్తంగా కర్ణాటక, తమిళనాడు, చత్తీస్గడ్, ఒడిస్సా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మరియ వివిధ రాష్ట్రాల నుండి ప్రముఖులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాలలో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని ఎంపిక చేసి కర్ణాటక ప్రముఖుల చేత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ సేవ పురస్కారం సన్మాన సభ నిర్వహించారు. ఎంపిక చేసి వారిని శాలువా కప్పి ఘనంగా సత్కరించి జాతీయ సేవ పురస్కారం మేమెంటో లతో పాటు ప్రశంసా పత్రలను అందజేశారు.
సామాజికవేత్త బి శ్రీనివాస్ మాట్లాడుతూ పురస్కారం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ నిర్వహిస్తున్న సన్మాన కార్యక్రమం మరువలేనిదని కొనియాడారు. దేశవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ 13 వ వార్షికోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సామాజికవేత్తలను ఎంచుకొని సన్మానం చేయడం చాలా గర్వకారణం అన్నారు. ఏడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షులుగా మరియు రాష్ట్ర మీడియా ప్రచార కార్యదర్శిగా పనిచేస్తూ ఆయా పాఠశాలలో మౌలిక వసతులు ఉన్నాయా లేదా అనే దానిపై పాఠశాల ను సందర్శించి విద్యార్థిని విద్యార్థినిలకు మెరుగైన సేవలు అందించినందుకు కర్నూలు జిల్లా నుండి ఎంపిక చేసిన సోమలరాజు అంతర్జాతీయ సొసైటీ సంస్థ నిర్వాహకులు రాజుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవ పురస్కారం ద్వారా మరింత బాధ్యతలు పెంచి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటానని బి శ్రీనివాసులు తెలిపారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




