News
నకిలీ కులదృవీకరణ పత్రంలను అందించిన అధికారులపై చర్యలు తీసుకోండి
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవి కుమార్ కర్నూల్ జిల్లా మెంబర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ రాజు, ఎరుకలక్కల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు కృష్ణ, మంత్రాలయం అధ్యక్షుడు బజారి, హనుమేష్ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు.
అనంతరం వారు మాట్లాడుతూ కౌతాళం తహశీల్దార్ కె. మల్లిఖార్జున స్వామి, కౌతాళం డిప్యూటీ తహశీల్దార్ ఎస్.ఐ. వీరేంద్ర గౌడ్, బదినేహాళు గ్రామానికి సంబంధించిన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్, బదినేహాళు గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సూర్య నారాయణ రెడ్డి కలిసి SC కమ్యూనిటీలోని మాదిగ కులానికి చెందిన నలగోడీ శ్రీనివాసులు అనే పేరుగల సెకండ్ గ్రేడ్ టీచర్ కు ST ఎరుకల కులదృవీకరణ పత్రం మంజూరు చేశారనె ఆరోపణలతో వీరిపై FIR 83/2024 u/s 61(2),336(3),318(4) BNS at Kurnool – Kowthalam PS of Kurnool Dist. నందు కేసు నమోదు చేశారు. దీనిపై పూర్తి విచారణ చేసి వీరిని సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆదోని సబ్ కలెక్టర్ మరియు డివిజనల్ మెజిస్ట్రీట్ మౌర్య భరద్వాజ్ కు వినతిపత్రాన్ని అందజేశామని తెలిపారు.
సబ్ కలెక్టర్ కు వీరు అందించిన వినతిపత్రం పూర్తి వివరాలు ఇలాఉన్నాయి..
బదినేహాళు గ్రామానికి చెందిన VRO, RI లతో పాటు కౌతాళం డిప్యూటీ తహశీల్దార్, తహశీల్దార్ ద్వారా ఫాల్స్ క్యాస్ట్ సర్టిఫికెట్ ను, ఫాల్స్ ఇన్కమ్ సర్టిఫికెట్ ను పొందిన నల్లగోడి శ్రీనివాసులు స్వగ్రామం కల్లూరు మండల పరిధిలోని పెద్దపాడు గ్రామం కాగా కర్నూలు నగరంలోని ధర్మ పేటలో ఉన్న ఇంటి నెంబర్ 40 – 707 లో నివాసం ఉంటున్నారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగోడి శ్రీనివాసులు ఎస్టీ కమ్యూనిటీకి చెందిన ఎరుకల కుల ధృవీకరణ ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ ను నంద్యాల మండల రెవెన్యూ అధికారి కార్యాలయం పేరుతో తయారు చేసుకుని, దానిని సమర్పించి డీఎస్సీ – 2000 లో సెకండ్ గ్రేడ్ టీచర్ ఉద్యోగం పొందారు. ఆ ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ సహాయంతో డీఎస్సీ – 2000 వ్యవహారాలను చూసిన అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ , కర్నూలు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి, కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారి మోసం చేసి అక్రమంగా, తప్పుడు పద్ధతిలో ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారని ఈ విషయం పైన విద్యాశాఖ అధికారులకు వీరితో పాటు మరి కొందరు ఫిర్యాదులు చేశారని తెలిపారు. నల్లగోడి శ్రీనివాసులు తన ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ పైన ఉన్న ఫిర్యాదుల నుంచి బయట పడటం కోసం, ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం చైతన్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, ఆదోని పేరుతో పదో తరగతి కి సంబంధించిన ఫేక్ మార్కుల జాబితాను, ఫేక్ బదిలీ సర్టిఫికెట్ ను, ఫేక్ స్టడీ సర్టిఫికెట్ ను తయారు చూశారని ఆరోపించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండల పరిధిలోని సంజీవరాయుని పేటకు చెందిన శ్రీ సత్యసాయి జూనియర్ కళాశాల పేరుతో ఇంటర్మీడియట్ కోర్సుకు సంబంధించిన ఫేక్ మార్కుల జాబితాను తయారు చేసుకొని. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రికి చెందిన జె. సి. నాగిరెడ్డి డిగ్రీ కళాశాలల పేరుతో డిగ్రీ కోర్సుకు చెందిన ఫేక్ సర్టిఫికెట్స్ ను, ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసుకున్నారని. పైన చెప్పిన వాటి వివరాలను కౌతాళం తహశీల్దార్ కె. మల్లిఖార్జున స్వామి కర్నూలు కలెక్టర్, కౌతాళం సర్కిల్ ఇన్స్పెక్టర్ కి గత నెల 27 వ తేదీ అందించిన ఫిర్యాదుల్లో స్పష్టంగా తెలియజేశామని అన్నారు. నైతిక విలువలతో కూడి ఉండాల్సిన ఉపాధ్యాయుడిగా ఉంటూ ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చే విధంగా విద్యార్హతలకు సంబంధించిన ఫేక్ సర్టిఫికెట్స్ ను, ఫేక్ డాక్యుమెంట్లను తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, విద్యాశాఖను, రెవెన్యూ శాఖను పనిగట్టుకుని మోసం చేసిన నల్లగోడి శ్రీనివాసులు పైన కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
తప్పు చేసిన ఇతని పై ఫేక్ క్యాస్ట్ సర్టిఫికెట్ పైన విచారణ అధికారిగా పనిచేసిన నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హైస్కూల్ ఆదోని హెడ్ మాస్టర్ హలీం సిద్ధిఖీ విచారణను పూర్తి చేసి 28-08-2024 వ తేదీన విచారణ నివేదికను కర్నూలు జిల్లా విద్యాశాఖాధికారికి అందజేశారు. ఆ నివేదికను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
News
సహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
ఆదోని, ఫిబ్రవరి 21:ఆదోనిలోని డి.సి.సి.బి (DCCB) బ్యాంక్ ఎదుట తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సహకార సంఘాల ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శనివారం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సమ్మె శిబిరాన్ని సందర్శించిన సంఘం నాయకులు ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు:
- వ్యవసాయానికి వెన్నెముక: గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి సాగు పెట్టుబడి నుంచి ఇతర సేవల వరకు ప్రాథమిక సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని వారు కొనియాడారు.
- ప్రభుత్వ బాధ్యత: సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా, వాటిని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు గుర్తు చేశారు.
- తక్షణ పరిష్కారం: గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు శాంతియుతంగా పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. వారి న్యాయమైన కోర్కెలను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘాల ఉద్యోగులు, కార్మిక సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
News
పోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
ఆదోని, ఫిబ్రవరి 18:
ప్రయాణంలో అజాగ్రత్తగా వదిలేసిన లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆదోని వన్ టౌన్ పోలీసులు కేవలం ఒకే ఒక్క గంటలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అసలేం జరిగిందంటే? కౌతాలం నుంచి ఆదోనికి ఆర్టీసీ బస్సులో వచ్చిన ఓ మహిళ, విశాల్ మార్ట్ వద్ద దిగుతూ తన బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగులో 6 లక్షల రూపాయల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. అయితే, ఆ తొందరలో తన వెంట తెచ్చుకున్న బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొద్దిసేపటి తర్వాత బ్యాగు గుర్తుకు రావడంతో హుటాహుటిన బస్టాండ్కు చేరుకుని డ్రైవర్ను సంప్రదించారు. బస్సులో వెతికినప్పటికీ బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన బాధితురాలు సాయంత్రం 3:30 గంటలకు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ గారికి ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితురాలి ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన పోలీసులు బస్సు డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేపట్టారు. పలు ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చేపట్టారు. సాయంత్రం 4:30 గంటలకు పోగొట్టుకున్న సొత్తును తిరిగి పొందిన బాధితురాలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
News
నాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
ఆదోని రూరల్, ఫిబ్రవరి 18:
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా ఆదోని డీఎస్పీ శ్రీ హేమలత సూచనల మేరకు, రూరల్ సీఐ నల్లప్ప పర్యవేక్షణలో బుధవారం పెద్దతుంబలం పోలీసులు భారీ దాడులు నిర్వహించారు.
ఘటన వివరాలు:
పెద్దతుంబలం ఎస్ఐ విద్యా శ్రీ, తన సిబ్బంది రంగస్వామి (PC-3603), రామకృష్ణ (PC-3637)లతో కలిసి దొడ్డనగిరి గ్రామ శివార్లలోని సిద్ధాపురం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఉన్న గుట్టల వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడ గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న నాటు సారా బట్టిని పోలీసులు గుర్తించారు. పోలీసుల రాకను గమనించిన నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు.
భారీగా ఊట ధ్వంసం:
పోలీసులు సారా బట్టి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్కడ నిల్వ ఉంచిన ఊటను తక్షణమే ధ్వంసం చేశారు. అలాగే, ప్లాస్టిక్ క్యాన్లలో నిల్వ ఉంచిన 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
నిందితుడి గుర్తింపు:
పోలీసుల ప్రాథమిక విచారణలో, సారా బట్టి నిర్వహిస్తున్న వ్యక్తి ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు కుమారుడు బోయ శివగా తేలింది. స్థానిక పొలాల యజమానుల నుంచి సేకరించిన సమాచారం మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విద్యా శ్రీ తెలిపారు. అక్రమ మద్యం తయారీ మరియు రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

-
News2 weeks agoవ్యాధి నయం కావడం లేదన్న బెంగతో ఆత్మహత్య
-
News2 weeks agoహత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు
-
News2 weeks agoఅదోనిలో అక్రమ మద్యం విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
-
News2 weeks agoపోగొట్టుకున్న బ్యాగ్ను పోలీసులు ఒకే ఒక్క గంటలో రికవరీ
-
News2 weeks agoమహిళా భద్రతపై అవగాహన సదస్సు
-
News1 week agoసహకార ఉద్యోగుల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం బాసట
-
News2 weeks agoనాటు సారా స్థావరంపై పోలీసుల దాడి
