News
వర్షంలో రోడ్డు పై నాట్లు వేసి నిరసన..
కర్నూలు జిల్లా ఆదోని మండలం గణేకల్లు గ్రామంలో చినుకు పడితే చిత్తడే చిత్తడి అని వర్షంలో రోడ్డు పై నాట్లు వేసి సిపిఎం పార్టీ నాయకులు, DYFI నాయకులు, గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మూడో వార్డులో 1982లో ఇంటి స్థలాలు ఇచ్చిన సిసి రోడ్లు వేయలేదని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు బి. వీరారెడ్డి, డి. రామాంజనేయులు DYFI మండల నాయకులు చిరంజీవి అన్నారు. కొద్ది చిన్నపాటి వర్షం వచ్చిన మట్టి రోడ్డు పై వర్షపు నీరు పూర్తిగా నిలబడి జనాలు రాక పోకలకు తీవ్ర అంతరాయం కలిగి ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా డ్రైనేజ్ కాలువ లేక సిసి రోడ్ల లేక కొన్నిచోట్ల వీధిలైట్లు లేక ఇబంధులు ఎదుర్కొంటున్నారని దానివల్ల విష పురుగులు కూడా వస్తున్నాయని, మురికి నీరు నిలబడినచోట బ్లీచింగ్ పౌడర్ కూడా వేయడం లేదని గతంలో సిపిఎం పార్టీగా సిసి రోడ్లు డ్రైనేజీలు వేయాలని సంతకాలు సేకరించడం గ్రామ సభలో అధికారుల దృష్టికి తీసుకుపోయిన అవార్డు వైపు ఏ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదని ఆరోపించారు. కొత్త కాలనీ లొ ఇదే పరిస్థితి ఉందని ఈ రెండు ప్రాంతాలలో ఇంట్లో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ కాలువలు సిసి రోడ్లు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఈ కార్యక్రమం లో కాలనీ వాసులు బంగారయ్య వెంకటేషులు పెద్ద వీరేష్ బంగారుబాబు తదితరులు పాల్గోన్నారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




