News
మా లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం
టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం
కర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తో కలిసి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (NRDC) దక్షిణ విభాగం అయిన డాక్టర్ B.K. సాహు, టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా వ్యవస్థాపక మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ M. సతీష్ బాబు, శిక్షణా భాగస్వామి జ్యోతి కనుమూరి హాజరయ్యారు.

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులకు ఇంటన్షిప్ లో భాగంగా ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లో ఆదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో 23-24 సంవత్సరం బ్యాచ్లోని 471 మంది విద్యార్ధులు 11రకాల కోర్సుల్లో నైపుణ్యం పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మేమేంటోస్ అందజేశారు.

సమావేశంలో పలుగోన్న ప్రతినిధులు మాట్లాడుతూ టెక్- మార్క్ ప్రధాన లక్ష్యం విద్యార్ధులలో ఉపాధి అవకాశాలను పెంచడం, ఉత్తమ ప్రతిభావంతమైన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమని తెలిపారు. టెక్-మార్క్ వివిధ విద్యా సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మరియు ఆంట్రప్రెన్యూర్పిప్ డెవలప్మెంట్ సెంటర్లను ఎర్పాటు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాంమని తెలిపారు. గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాలలో చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి MSME సహకారంతో ముందుకు వెళుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అధ్యక్షులు విట్టా సతీష్ కుమార్, కార్యదర్శి మరియు కరెస్పాండెంట్ దైవధీనం రెడ్డి, ప్రిన్సిపల్ మురళీ మోహన్ పాలుగొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




