News
మా లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం
టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లక్ష్యం విద్యార్ధులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం
కర్నూలు జిల్లా అదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజ్లో టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తో కలిసి విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (NRDC) దక్షిణ విభాగం అయిన డాక్టర్ B.K. సాహు, టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా వ్యవస్థాపక మరియు మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ M. సతీష్ బాబు, శిక్షణా భాగస్వామి జ్యోతి కనుమూరి హాజరయ్యారు.

డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులకు ఇంటన్షిప్ లో భాగంగా ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ సంస్థ విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. టెక్-మార్క్ ట్రైనింగ్ ఇండియా సంస్థ లో ఆదోని ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో 23-24 సంవత్సరం బ్యాచ్లోని 471 మంది విద్యార్ధులు 11రకాల కోర్సుల్లో నైపుణ్యం పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు, మేమేంటోస్ అందజేశారు.

సమావేశంలో పలుగోన్న ప్రతినిధులు మాట్లాడుతూ టెక్- మార్క్ ప్రధాన లక్ష్యం విద్యార్ధులలో ఉపాధి అవకాశాలను పెంచడం, ఉత్తమ ప్రతిభావంతమైన విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడమని తెలిపారు. టెక్-మార్క్ వివిధ విద్యా సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మరియు ఆంట్రప్రెన్యూర్పిప్ డెవలప్మెంట్ సెంటర్లను ఎర్పాటు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన అనంతరం ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాంమని తెలిపారు. గ్రామీణ మరియు అర్బన్ ప్రాంతాలలో చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి MSME సహకారంతో ముందుకు వెళుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అధ్యక్షులు విట్టా సతీష్ కుమార్, కార్యదర్శి మరియు కరెస్పాండెంట్ దైవధీనం రెడ్డి, ప్రిన్సిపల్ మురళీ మోహన్ పాలుగొన్నారు.

News
ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్లా దొంగ ముల్లా లతీఫ్ అనే వ్యక్తి అరెస్ట్ చేసి అతని వద్ద నుండి 10 లక్షల విలువైన 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం లక్ష్మమ్మ అవ్వ ఆర్చ్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానంతో హనవాలు గ్రామానికి చెందిన ముల్లా లతీఫ్ (31) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆదోని, పత్తికొండ మరియు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. ఆస్పరి కొత్త బైపాస్ రోడ్డు సమీపంలో రహస్యంగా దాచిన రూ. 10 లక్షల విలువైన 12 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడు ముల్లా లతీఫ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టూ టౌన్ సి.ఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
