దశాబ్ధాల సమస్యకు పరిష్కారం
◆నారాయణపురంలో రూ.4.79 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన.
◆ ఐదు గ్రామాలకు ప్రయాణం సులభతరం.
◆ ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..
అనంతపురం రూరల్ పరిధిలోని ఎం.నారాయణపురం గ్రామంలోని ఆర్డిటి చెక్ డ్యామ్ దగ్గరలో రూ.4.79 కోట్లతో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తదితరులు పాల్గొన్నారు.