దశాబ్ధాల సమస్యకు పరిష్కారం
◆నారాయణపురంలో రూ.4.79 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన.
◆ ఐదు గ్రామాలకు ప్రయాణం సులభతరం.
◆ ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..
అనంతపురం రూరల్ పరిధిలోని ఎం.నారాయణపురం గ్రామంలోని ఆర్డిటి చెక్ డ్యామ్ దగ్గరలో రూ.4.79 కోట్లతో నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి పనులకు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

నారాయణపురంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..
నారాయణపురంలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *