News
టిడిపి నేతలపై చంద్రబాబు ఆగ్రహం…!
అమరావతి : నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై నేతలపై నమోదు చేసిన కేసులు వివరాలు ఇప్పటికి ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుమార్లు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చిన కొంతమంది నాయకులు స్పందించకపోవడంపై సీరియస్ అయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిలు నిర్లక్ష్యం వీడి ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు సూచించారు. లోకేష్ ప్రజా దర్బార్ పేరుతో రాష్ట్ర ప్రజల, కార్యకర్తల వారి సమస్యలు కోసం తన నివాసంలో ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేను స్వయంగా వివరాలు అడిగి తెలుసుకుంటున్నాను అని చంద్రబాబు నాయుడు తెలిపారు. అనేకమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పై కేసు ఉన్నాయంటూ ఫిర్యాదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తల చిన్న చిన్న సమస్యలు కూడా తెచ్చుకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జులు ఐ టి డి పి, సోషల్ మీడియా వాళ్ళు వద్ద వివరాలు ఉంటాయి వారి వద్ద నుంచి అనేక సమస్యలను సేకరించండి అని సూచించారు. పార్టీ చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి సోషల్ మీడియా, ఐటిడిపి, వాళ్లని తీసుకొని ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో గుర్తింపు వచ్చే విధంగా చేసుకోవాలని సూచించారు.
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

H అదినారాయణ
14/07/2024 at 7:18 pm
మరి నిన్న 13/7/24 వతేదీన online నంబరు కేటాయించిన వారితో CBNగారు మాట్లాడలేదు. పల్లా శ్రీనివాసరావు గారు నిర్వహించారు. వచ్చిన ప్రజలు కొంత నిరుత్సాహం చెందారు.
భవిష్యత్ లో ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలి🙏