News
కేసులు మీరు పెడతారా? మమ్మల్ని పెట్టమంటారా? నూర్ అహ్మద్ MHPS
కర్నూలు జిల్లా ఆదోని బసాపురం సమ్మర్ స్టోరేజి ట్యాంక్, సంతెకుడ్లూరు సమ్మర్ స్టోరేజి ట్యాంకుల నాసిరకం పనుల అవినీతి పై సీబీఐ విచారణ జరిపి నిందితులను శిక్షించాలని, సదరు ట్యాంకుల రిపేరికి నిధులను అవినితి పరుల నుంచే కక్కించాలని ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథిని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేశారు.

యం హెచ్ పి యస్ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ తాను మోడీ గారి శిష్యుడినని చెప్పుకునే ఆదోని ఎమ్మెల్యే పార్థ సారథి తలుచుకుంటే సీబీఐ విచారణ వేయించటం పెద్ద పనేమీ కాదని అన్నారు. బసాపురం మరియు సంతెకుడ్లూరు యస్ యస్ ట్యాంకులు దెబ్బతినటంతో ఆదోని పట్టణము మరియు గ్రామాలకు తీవ్రమైన నీటి సమస్య నెలకొన్నది. ఇంతటి పెను సమస్యకు కారకులైన నాయకులు, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు మరియు అధికారులు చట్టం నుంచి తప్పించుకుని స్వేచ్ఛగా తిరగటం ఆదోని ప్రజలను అవమానించటమే అని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినితి పై చర్యలు తీసుకోకపోతే ఆదోనిలో అవినీతి చేసినా పట్టించుకునే వారు ఉండరు, ఎలాంటి శిక్ష పడకుండా క్షేమంగా ఉండవచ్చు అనే తప్పుడు సంకేతాలు వెళతాయి.

కాబట్టి ఆదోని ఎమ్మెల్యే గత పాలకుల అవినీతి అక్రమాల పై కేసులు పెట్టి ఆదోనిలో అవినీతి అంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అవినీతి పై ఎమ్మెల్యే కేసులు పెట్టకపోతే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించి కేసులు పెట్టటానికి సిద్ధంగా ఉన్నామని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరపున ప్రకటించారు.
ఈ సమావేశంలో వసీమ్ సాహెబ్, హసన్, ఆబిద్ అలి పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




