News
ఆదోని వెయిట్ & మెజర్మెంట్ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా అదోనిలో శనివారం తూనికలు మరియు కొలతల అధికారుల దాడులు నిర్వహించారు. తిమ్మారెడ్డి బస్టాండ్ ప్రక్కన పెట్రోల్ బంక్ లో ఉన్న బాలాజీ వేయింగ్ బ్రిడ్జ్ లో 40కేజీల తేడా వస్తుందని నాన్ స్టాండర్డ్ క్రింద కేసునమోదు చేసామని అధికారులు తెలిపారు. అసిస్టెంట్ కంట్రోల్ శ్రీరామ్ మాట్లాడుతూ తూకాలలో తేడాలు వస్తున్నాయని రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటినుంచి వేయింగ్ మిషన్లపై కూడా నిఘా ఉంచి దాడులు చేస్తామని తెలిపారు. ఎక్కడైనా తూకాలు తేడా వస్తే తూనికల కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.
పత్తి జిన్నిగ్ ఫ్యాక్టరీలలో వేయింగ్ మిషన్లు పెట్టి కొన్ని ఫ్యాక్టరీలో 50 కేజీల నుంచి 300 కేజీల వరకు రైతులను మోసం చేస్తున్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాటిపై నిఘా ఉంచి త్వరలో పట్టుకుంటామని అన్నారు. బయటవి ఉన్న వేయింగ్ మిషన్స్ కూడా ఫ్యాక్టరీలతో కుమ్మక్కై తూకాలు తేడా చేస్తున్నారని త్వరలో పూర్తి సమాచారంతో దాడులు నిర్వహించి పట్టుకుంటామని తెలిపారు.

News
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్ గ్రామ సమీపంలో బైకును లారీ ఢీ కోరడంతో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్తితి విషమంగా ఉంది. మృతుడు కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన ఈరప్పగా పోలీసులు గురించారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించరు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

News
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!
ఎమ్మిగనూరు, మే 13:
లైసెన్స్ల రెన్యూవల్ కోసం లంచం డిమాండ్ చేసిన వ్యవసాయ శాఖ అధికారి, మరో ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల ఈ ఈ విధంగా ఉన్నాయి..
ఎమ్మిగనూరు పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఈడిగ రంగన్న అనే వ్యక్తి ‘మహాలక్ష్మి ట్రేడర్స్’ పేరుతో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నారు. తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ చేయడంతో పాటు, కొత్తగా విత్తనాల విక్రయాలకు అనుమతి పొందడం కోసం ఆయన దరఖాస్తు చేసుకున్నారు. ఈ పనులు పూర్తి చేయడానికి ఎమ్మిగనూరు వ్యవసాయ కార్యాలయ ఏఈవో (AEO) నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ ద్వారా రూ. 35 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని రంగన్న మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందస్తు పథకం ప్రకారం, బుధవారం సాయంత్రం వ్యవసాయ కార్యాలయంలో రంగన్న నుంచి ఏఈవో నర్సింహులు, ప్రైవేట్ వ్యక్తి మోహన్ రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల నుంచి లంచం సొమ్ము రూ. 30 వేలతో పాటు, మోహన్ వద్ద ఉన్న మరో రూ. 73 వేల అనధికారిక నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు రాజా ప్రభాకర్, కృష్ణయ్య, ఎస్సై సుబ్బారాయుడు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
“అవినీతికి పాల్పడితే ఎంతటి వారినైనా వదిలేది లేదు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే ఏసీబీని సంప్రదించాలి.”. — సోమన్న, ఏసీబీ డీఎస్పీ
News
రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి
ఆదోని 08 మే 2026
వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను పెంచేందుకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను ఆదోని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కోరారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు, చిన్న ట్రాక్టర్లు, తైవాన్ స్ప్రేయర్లు మరియు వివిధ రకాల ట్రాక్టర్ అనుబంధ పరికరాలు రాయితీపై అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.
అర్హతలు మరియు నిబంధనలు:
భూమి కలిగిన రైతులు మరియు RoFR రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే, గత మూడు సంవత్సరాలలో కనీసం మూడు పంట సీజన్లకు e-Pantaలో నమోదైన CCRC రైతులు కూడా అర్హులు. అయితే, 2024-25 సంవత్సరంలో ఇప్పటికే సబ్సిడీ పొందిన వారు మళ్ళీ దరఖాస్తు చేయడానికి వీలుండదు. ప్రతి కుటుంబం నుండి ఒకరికి మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
సబ్సిడీ వివరాలు:
SC, ST వర్గాలకు చెందిన వారు, మహిళా రైతులు మరియు చిన్న, సన్నకారు రైతులకు యంత్రం ధరలో 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఇతర రైతులకు 40 శాతం వరకు రాయితీ ఉంటుంది. రైతులు తమ అవసరానికి అనుగుణంగా ఒకటి లేదా రెండు పరికరాలను ఎంపిక చేసుకోవచ్చు.

ఎంపిక మరియు చెల్లింపు విధానం:
రైతులు తమ గ్రామ వ్యవసాయ సహాయకుల (RSK సిబ్బంది) సహకారంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ట్రాక్టర్ పరికరాల కోసం దరఖాస్తు చేసే వారు ట్రాక్టర్ RC కాపీని తప్పనిసరిగా జతచేయాలి. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైన రైతులకు SMS ద్వారా సమాచారం అందుతుంది. ఎంపికైన వారు 15 రోజుల్లోగా తమ వాటా సొమ్మును ఆన్లైన్ ద్వారా డీలర్ ఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన గడువు తేదీలు:
దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 19-05-2026 చివరి తేదీ. ఎంపిక ప్రక్రియ (లాటరీ) మే 23 నుండి 25 వరకు జరుగుతుంది. ఎంపికైన రైతులు మే 26 నుండి జూన్ 9వ తేదీ లోపు నగదు చెల్లించాలి. మే 26 నుండి జూన్ 26వ తేదీ లోపు రైతులకు యంత్రాల సరఫరా జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు.
