News
దుల్హన్ పథకం అమలు
వివాహ పథకం యొక్క ప్రయోజనాలు
ఆంధ్రప్రదేశ్లో దుల్హన్ వివాహ పథకాన్ని పొందడం వల్ల కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా వివరించబడ్డాయి:
మైనారిటీ కమ్యూనిటీకి చెందిన అమ్మాయికి వివాహ సమయంలో కుటుంబ భారాన్ని తగ్గించుకోవడానికి ఈ పథకం ఆర్థిక సహాయం రూపంలో ప్రయోజనాలను మంజూరు చేస్తుంది.
ఈ పథకం కింద, రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయి వివాహ వేడుక కోసం రూ.1,00,000 అందిస్తుంది.
దరఖాస్తుదారు వివాహ తేదీ నుండి ఒక నెల ముందు పథకం కోసం దరఖాస్తు చేయాలి.
అర్హత ప్రమాణం
ఈ వివాహ పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు కింది అర్హత షరతులను కలిగి ఉండాలి:

వివాహ సమయంలో ఈ పథకాన్ని పొందేందుకు, వధువుకు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
అలాగే, గ్రహీతల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణేతర ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు మించకూడదు.
వధువు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరురాలై ఉండాలి.
అవసరమైన పత్రాలు
మీ దరఖాస్తు ఫారమ్ను సమర్పించే సమయంలో అవసరమైన డాక్యుమెంట్లను అందించాలి.
వధువు మరియు వరుడు ఇద్దరి జనన ధృవీకరణ పత్రం
ఆధార్ కార్డు
కమ్యూనిటీ సర్టిఫికేట్
చిరునామా రుజువు (ఓటర్ ID & రేషన్ కార్డ్)
వివాహ కార్డు
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




