News
ఉపాధి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
ఉపాధి లేక గ్రామాలు ఖాళీ అవుతుంటే ఇక్కడే పని చేసుకుంటున్నా ఉపాధి కూలీల జీతాలు చెల్లించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం నిర్లక్ష్యం వహిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలంలో మంగళవారం దొడ్డనకేరి, మంత్రికి, పెసల బండ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఉపాధి పని ప్రదేశంలో కూలీలను కలిసి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ఐదు వారాలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే. లింగన్న, మండల కార్యదర్శి రామాంజనేయులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఇప్పటికే గ్రామాలు ఖాళీ అవుతుంటే, ఇక్కడే పనులు కల్పిస్తామని చెబుతున్న అధికారులు వేతనాలు చెల్లించడంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నారని, చట్టంలో చెప్పినట్లుగా పని చేసిన 14 రోజుల లోపల వేతనాలు ఇవ్వాల్సి ఉన్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలను నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే ఉపాది హామీ వేతనాలు ఇవ్వాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున కూలీలతో కలిసి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.


News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


