News
విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకే క్రీడా పోటీలు
విద్యార్థిని విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ 3160 గవర్నర్ మాణిక్ ఎస్ పవార్ అన్నారు.
కర్నూలు జిల్లా అదోని స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ఆదివారం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గ్రామాల నుండి 53 పాఠశాలల దాదాపు 2500 మంది విద్యార్థిని విద్యార్థులు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం కాగడ చేత పట్టుకుని పోటీలను ప్రారంభించారు. క్రీడల పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు కప్పులతో పాటు రోటరీ క్లబ్ సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ క్రీడా పోటీల్లో బాలుర జట్లు ఫుట్బాల్ లో 16 జట్లు, త్రో బాల్ 20 జట్లు, కబడ్డీ 33 జట్లు, డాడ్జ్ బాల్ 12 జట్లు , బాస్కెట్ బాల్ 5, అథ్లెటిక్స్ 41, గర్ల్స్ లో జట్లు, కోకో గర్ల్స్ 22 జట్లు, త్రో బాల్ 20 జట్లు, కబడ్డీ గర్ల్స్ 20 జట్లు, టెన్నికాయిట్ గర్ల్స్ 14జట్లు, అథ్లెటిక్స్ 40 జట్లు క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడ పోటీలను రోటరీ సభ్యుడు సాబీర్ అహ్మద్ సహాయ సహకారాలు మరియు 60 మంది వ్యాయామ ఉపాధ్యాయుల సహకారం ఎనలేని వని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రీజినల్ కోఆర్డినేటర్ విజయ్ నాగరాజు, అసిస్టెంట్ గవర్నర్ భరత్ షా, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ఉమేష్ పాయి, కార్యదర్శి నితీష్ గాంధీ, యూత్ ఆఫీసర్స్ అమిత్ గాంధీ, కొల్లి నితిన్, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరస్పాండెంట్ దైవదినం రెడ్డి, మల్లికార్జున విద్యాలయ కరస్పాండెంట్ సూగురప్ప రోటరీ క్లబ్ సభ్యులు జీవన్ సింగ్, సునీల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, బసవరాజు, ప్రశాంత్ గాంధీ, రఘునాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, వికాస్ బండారి, రాయచోటి సుబ్బయ్య, వినోద్ జైన్, డాక్టర్ సైఫుల్ల, విట్టా రాజేష్, విజయ్ చౌదరి, ఇతేష్, వీరేష్ స్వామి, షణ్ముఖ, శివరాం, హుస్సేన్ భాష తదితరులు పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




