Connect with us

News

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు

Published

on

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా జాయింట్ కలెక్టర్  బి. నవ్య పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో  శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదోని డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్స్ సంబంధిత  అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఇంటి పట్టా కొరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని దరఖాస్తులు అర్హులు ఉన్నారు అని ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు మరియు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలాన్ని అర్హులైన వ్యక్తులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, స్థలాలను వెంటనే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు తెలిపారు. ప్రభుత్వ సంకల్పం మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి అందేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు.  సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటివరకు 1474 జాయింట్ ఎల్పిఎంలు గుర్తించగా, కేవలం 309 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపారు. మిగిలిన దరఖాస్తులు జూన్ 30వ తేదీ లోపు పూర్తిచేయాలని తహశీల్దార్లకు ఆదేశించారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య మరియు ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమీక్ష సమావేశం

65 సంవత్సరాలు పైబడినవారికి మరియు దివ్యాంగులకు రేషన్ సరుకులను జూన్ 25 నుండి 30వ తేదీ లోపు డోర్ డెలివరీ చేయాలని పేర్కొన్నారు. డోర్ డెలివరీ ప్రక్రియలో ఎంతమందికి సరుకులు అందించామో, ఎంతమందికి అందించలేకపోయామో వివరాలు సమగ్రంగా ఇవ్వాలని అధికారులకు తెలిపారు. జూలై నెల రేషన్ సరుకుల పంపిణీ వంద శాతం పూర్తి కావాలని స్పష్టం చేశారు.
కౌలు రైతు కార్డులపై కూడా సమీక్ష నిర్వహించారు. గత సంవత్సరం ఆదోని డివిజన్లో 10,500 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం కేవలం 1,100 కార్డులే నమోదు అయ్యాయని తెలిపారు. జూలై 15వ తేదీ లోపు రీన్యూవల్ మరియు కొత్త దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజును ఆదేశించారు.
     ఈ కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డివిజన్లోని తాసిల్దారులు, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, గంగిరెడ్డి, ఆదోని వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధరాజు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్స్ వేణు సూర్య, శ్రీనివాసరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ బి.నవ్య అధికారులతో సమీక్ష సమావేశం
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

ఆదోని 09-01-2026:

కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

09 01 26 రైతు బజార్ ధరల పట్టిక
అడ్వర్టైజ్మెంట్
Continue Reading

News

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక

Published

on

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

Continue Reading

News

కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.

కాలుతున్న పత్తి
మంటలు ఆర్పుతున్న స్థానికులు
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
జెసిబి తో పత్తిని పక్కకు చూస్తున్న ఫోటో
Continue Reading

Trending