News
ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం వాలంటీర్లదె
నిష్పక్షపాతంగా పనిచేసి సంక్షేమ పథకాలను పేదలకు అందజేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్లకు సూచించారు.
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసుదన్ చేతుల మీదుగా సచివాలయ వాలంటిర్ లకు ముగ్గురికి సేవా వజ్ర, ఆరు మందికి సేవా రత్న, 656 మందికి సేవా మిత్ర పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి మాట్లాడారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఎంపీ, ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతినిధులకు సేవ చేసే అవకాశం లేదని, సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అలాంటి అవకాశం కల్పించారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించే పథకాల వివరాలను ఎప్పటికప్పుడు వివరించి పేదలు లబ్ధి పొందేలా చూడాలన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శాంత, రాష్ట్ర విరాసేవ లింగాయిత్ కార్పొరేషన్ డైరెక్టర్ డి. మంజుల, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.

News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
-
News2 weeks agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News4 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News2 weeks agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News4 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 weeks agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News3 weeks agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News4 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News4 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
