Connect with us

News

ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం వాలంటీర్లదె

Published

on

నిష్ప‌క్ష‌పాతంగా ప‌నిచేసి సంక్షేమ పథకాలను పేదలకు అందజేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్లకు సూచించారు.
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసుదన్ చేతుల మీదుగా సచివాలయ వాలంటిర్ లకు ముగ్గురికి సేవా వజ్ర, ఆరు మందికి సేవా రత్న, 656 మందికి సేవా మిత్ర పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి మాట్లాడారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఎంపీ, ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతినిధులకు సేవ చేసే అవకాశం లేదని, సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అలాంటి అవకాశం కల్పించారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించే పథకాల వివరాలను ఎప్పటికప్పుడు వివరించి పేదలు లబ్ధి పొందేలా చూడాలన్నారు.

సేవ పురస్కారం సభలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ డైరెక్టర్లు కౌన్సిలర్లు


ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శాంత, రాష్ట్ర విరాసేవ లింగాయిత్ కార్పొరేషన్ డైరెక్టర్ డి. మంజుల, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.

సేవ పురస్కారం సభలో కూర్చున్న వాలంటీర్లు
Youtube video
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నూతన రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి కి పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఆమె పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, పరిపాలనాంశాలపై కలెక్టర్ సిరి నూతన ఆర్డీవోకు పలు సూచనలు చేశారు.

అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ కు పూల మొక్క అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మకు పూల మొక్క  అందజేస్తున్న ఫోటో
కలెక్టర్ కార్యాలయంలో పూల మొక్క అందజేస్తున్న ఆదోని ఆర్ డి ఓ అరుణ దేవి
Continue Reading

News

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

Published

on

ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగులకు బానిసై దొంగతనానికి పథకం వేసిన యువకుడు.. కరీంనగర్‌లోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఆన్‌లైన్ బెట్టింగులకు బానిసై దాదాపు రూ.4 లక్షలు నష్టపోయిన జగిత్యాల జిల్లా గుల్లపేట గ్రామానికి చెందిన దమ్మ దినేష్ రెడ్డి(21) అనే యువకుడు..

లోన్ యాప్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించమని నిర్వాహకులు ఒత్తిడి చేయడంతో దొంగతనానికి పథకం వేసిన నిందితుడు. ఈ నెల 1వ తేదీన లేబర్ అడ్డా వద్ద కూలి పని కోసం నిలబడ్డ గంగాధర లక్ష్మీ అనే వృద్ధురాలి దగ్గరికి వెళ్లి, పని ఇప్పిస్తానని చెప్పి, నసుల్తాపూర్ శివారులోని తీసుకెళ్లి అర తులం బంగారం, 20 గ్రాముల వెండి కాజేసి వృద్ధురాలిని బావిలో తోసేసి వెళ్ళిపోయిన దినేష్ రెడ్డి..

వృద్ధురాలిని బావిలో నుంచి బయటికి తీస్తున్న గ్రామస్తులు

దాదాపు 21 గంటలు బావిలో ఉన్న అనంతరం, మరుసటి రోజు ఉదయం లక్ష్మిని గ్రామస్థులు బావి నుండి బయటకు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చిరు. సీసీటీవీ ఫుటేజ్, ర్యాపిడో బుక్ చేసిన ఫోన్ నంబర్ ఆధారంగా కరీంనగర్ అమరవీరుల స్తూపం వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నరు. నిందితుడిని దినేష్ రెడ్డిని విచారించగా బంగారాన్ని టవర్ సర్కిల్ వద్ద వేణు మనోహరాచారి అనే వ్యాపారికి విక్రయించి రూ.30 వేలు తీసుకున్న నిందితుడు తెలిపాడు. నిందితుడితో పాటు బంగారం వ్యాపారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

బావిలో పడిపోయిన వృద్ధురాలు
Continue Reading

News

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో టూ టౌన్ పోలీసులు సుమారు 30 లక్షలు విలువ చేసే 35 టు వీలర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సిఐ తెలిపిన వివరాల మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మంత్రాలయం నియోజకవర్గం చిన్న తుంబలం గ్రామానికి చెందిన వడ్డే మహేష్ అనే వ్యక్తి ని అనుమానంతో అపి విచారించగా తాను చోరీ చేసుకుని వెళ్తున్న వాహనమని గుర్తించి అతన్ని విచారించగా వడ్డే మహేష్ నుంచి నుంచి చోరీ అయిన సుమారు 30 లక్షల విలువచేసే 35 బైక్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వడ్డే మహేష్ కుమార్ ని అరెస్టు చేసి రిమైండ్ కి తరలించిన టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

సీజ్ చేసిన 35 వాహనాలు
సీజ్ చేసిన 35 వాహనాలు
మీడియాతో మాట్లాడుతున్న సిఐ రాజశేఖర్ రెడ్డి
Continue Reading
News1 hour ago

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

News3 days ago

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

News2 weeks ago

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

News2 weeks ago

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

News2 weeks ago

సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం

News1 month ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News1 month ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News2 months ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News2 months ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

Trending