నిష్పక్షపాతంగా పనిచేసి సంక్షేమ పథకాలను పేదలకు అందజేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వాలంటీర్లకు సూచించారు.
కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ మధుసుదన్ చేతుల మీదుగా సచివాలయ వాలంటిర్ లకు ముగ్గురికి సేవా వజ్ర, ఆరు మందికి సేవా రత్న, 656 మందికి సేవా మిత్ర పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి మాట్లాడారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఎంపీ, ఎమ్మెల్యే ఇతర ప్రజా ప్రతినిధులకు సేవ చేసే అవకాశం లేదని, సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లకు అలాంటి అవకాశం కల్పించారని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించే పథకాల వివరాలను ఎప్పటికప్పుడు వివరించి పేదలు లబ్ధి పొందేలా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శాంత, రాష్ట్ర విరాసేవ లింగాయిత్ కార్పొరేషన్ డైరెక్టర్ డి. మంజుల, మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ తిమ్మప్ప పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.