Connect with us

News

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిచే పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించాలి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ & బి గెస్ట్ హౌస్ లో ఎరుకుల సంఘం నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాయకుడు రవికుమార్ మాట్లాడుతూ దేశ ప్రధాని మరియు ఇతర కేంద్ర మంత్రులను గౌరవనీయులైన రాష్ట్రపతిచే నియమించబడతారు అలాంటిది పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని ఆహ్వానించకపోవడంపై అన్ని గిరిజన సంఘాలు ఖండిస్తున్నాయన్నారు. ఈ నిర్ణయం అత్యున్నత రాజ్యాంగ పదవిని అవమానించడమేనని గిరిజన సంఘాలు నాయకులు మండిపడ్డారు. నూతన పార్లమెంట్ భవనాన్ని ఆవిష్కరించే హక్కు రాష్ట్రపతికే ఉంటుందని కేంద్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నామన్నారు. పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధంగా బిజెపి నియంత ప్రభుత్వ వైఖరికి గిరిజన సంఘాలు మొత్తం ఏక కంఠంతో ఖండిస్తున్నాం అని అన్నారు. గిరిజన ప్రజానీకానికి ఈ దేశంలో అత్యున్నత స్థానం కల్పించేలా చేసిందని బిజెపి సంకలు గుద్దుకుండంతో నేడు అదే గిరిజన మహిళలకు నూతన పార్లమెంటు భవనానికి ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం గోరమైన అవమానం అని నిప్పులు చెరిగారు. రాజకీయపరంగా గిరిజనులను బిజెపి ప్రభుత్వం అవసరానికి వాడుకుంటున్నాయని అనడంలో తేటతెల్లం అయిందని వాపోయారు.
ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం నాయకులు మారుతి రావు, హనుమేష్, రామకృష్ణ, సుంకన్న తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

Published

on

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

జెండాను ఆవిష్కరిస్తున్న గౌరవాధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్
Continue Reading

News

లారీ కింద పడి బాలుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు.  ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Continue Reading

News

వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర  , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే  భోజనం చేశారు.

మహాగౌరి ఫ్యాక్టరీ

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి  కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర  మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

మృతదేహాన్ని అంబులెన్స్ లో తరలిస్తున్న ఫోటో
మృతుడు మాల రాఘవేంద్ర ఫైల్ ఫోటో
Continue Reading

Trending