కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెద్ద పెండేకల్లు గ్రామంలో ఉన్న కొండ ప్రాంతంలో చిరుత పులి కలకలం సృష్టించింది. గ్రామస్థులకు పులి కనిపించడంతో భయంతో పొలం పనులకు వెళ్లడం వదిలి ఎవరు ఇళ్లల్లో వారు ఉండిపోయారు, గొర్రెల కాపరులు బిక్కు బిక్కుమంటూ ప్రాణ భయంతో బతుకుతున్నారు, అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుత పులిని బంధించి సురక్షిత ప్రాంతంలో వదలాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.