News
ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు వేలంపాట వేసిన సబ్ అధికారులు
కర్నూలు జిల్లా ఆదోని పరిదిలో ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలను సెబ్ అధికారులు బహిరంగ వేలం పాట నిర్వహించారు. వేలం పాటలో మొత్తం 24 వాహనాలకు ₹ 2 లక్షల 13 వేల నగదు ప్రభుత్వ ఖజానాలో జమ చేశారు.

సిఐ విన్నీ లత తెలిపిన వివరాల మేరకు కర్నూలు జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఐ.పి.యస్. మరియు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ ఎన్.నాగరాజు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండ్ ఎస్.రవికుమార్ పర్యవేక్షణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన 24 వాహనాలను బహిరంగ వేలం వేయటం జరిగిందని తెలిపారు. ఇందులో ప్రభుత్వానికి 213000 వేల ఆదాయం వచ్చిందని మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా లో జమ చేశామని తెలిపారు. ఈ వేలంపాట కార్యక్రమంలో సబ్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ ఎస్. రవికుమార్, ఎస్ఐ ఇస్మాయిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




