Connect with us

News

పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు

Published

on

◆ 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పెద్ద చెరువు..
◆ సమస్య ను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు…
◆ సమస్య పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామ్.. సిపిఎం పార్టీ.

కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 26, 27, 28, తేదీల్లో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శుక్రవారం దీక్షలను ప్రారంభిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, మాట్లాడుతూ ప్రభుత్వము కోర్టులో ఉందనే సాగుతో పెద్ద చెరువు సమస్య నిర్లక్ష్యం చేస్తున్నదని, గత 30 సంవత్సరాలుగా ఈ చెరువు సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పోరాడుతూనే ఉందని పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. సబ్ కోర్టు, జిల్లా స్థాయి కోర్టు, హైకోర్టులో కూడా ప్రభుత్వ చేరువని తీర్పులు వెలువడినప్పటికీ స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణదారు విజయలక్ష్మి అప్పిల్ కు వెళ్లడం జరిగిందని, ఇప్పటికే ఎన్నో కేసులు కూడా గ్రామస్తులు భరించారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి చెరువు సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని వారు తెలిపారు.
నిరాహార దీక్షలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జే. రామాంజనేయులు, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిలు గోవిందు, అనీఫ్ బాషా, సిపిఎం పార్టీ శాఖ సభ్యులు కే నర్సిరెడ్డి, డిజే నర్సిరెడ్డి, కే హనుమంత రెడ్డి, యు. హనుమంత రెడ్డి, వై తాయన్న, యు. తాయప్ప, ఎస్ శిక్షావల్లి దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి పాండురంగ శాఖ సభ్యులు కృష్ణ భాష మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

దీక్షలకు మద్దతుగా సిపిఎం పార్టీ మండల నాయకులు హనుమంతరెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు శేఖర్, పార్టీ నాయకులు వెంకటేష్, సిఐటియు ఆటో యూనియన్ నాయకులు వీరేశ్, ఉరుకుందు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శ్రీకృష్ణ ఉపాధ్యక్షులు చిరంజీవి మరియు రమేష్ పాల్గొన్నారు.

దీక్షా శిబిరం వద్ద మాట్లాడు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే. లింగన్న
దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు
YouTube video
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending