News
పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని రిలే నిరాహార దీక్షలు

◆ 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పెద్ద చెరువు..
◆ సమస్య ను పరిష్కరించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు…
◆ సమస్య పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామ్.. సిపిఎం పార్టీ.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవుగల్ గ్రామంలో 30 సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్లో ఉన్న పాండవగల్ పెద్ద చెరువు సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 26, 27, 28, తేదీల్లో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శుక్రవారం దీక్షలను ప్రారంభిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె.వెంకటేశులు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కే లింగన్న, మాట్లాడుతూ ప్రభుత్వము కోర్టులో ఉందనే సాగుతో పెద్ద చెరువు సమస్య నిర్లక్ష్యం చేస్తున్నదని, గత 30 సంవత్సరాలుగా ఈ చెరువు సమస్య పరిష్కారం కోసం సిపిఎం పార్టీ పోరాడుతూనే ఉందని పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. సబ్ కోర్టు, జిల్లా స్థాయి కోర్టు, హైకోర్టులో కూడా ప్రభుత్వ చేరువని తీర్పులు వెలువడినప్పటికీ స్వాధీనం చేసుకోవడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఆక్రమణదారు విజయలక్ష్మి అప్పిల్ కు వెళ్లడం జరిగిందని, ఇప్పటికే ఎన్నో కేసులు కూడా గ్రామస్తులు భరించారని అన్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి చెరువు సమస్యను పరిష్కరించాలని లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేపడతామని వారు తెలిపారు.
నిరాహార దీక్షలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు జే. రామాంజనేయులు, సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిలు గోవిందు, అనీఫ్ బాషా, సిపిఎం పార్టీ శాఖ సభ్యులు కే నర్సిరెడ్డి, డిజే నర్సిరెడ్డి, కే హనుమంత రెడ్డి, యు. హనుమంత రెడ్డి, వై తాయన్న, యు. తాయప్ప, ఎస్ శిక్షావల్లి దీక్షలో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి పాండురంగ శాఖ సభ్యులు కృష్ణ భాష మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
దీక్షలకు మద్దతుగా సిపిఎం పార్టీ మండల నాయకులు హనుమంతరెడ్డి, రైతు సంఘం మండల అధ్యక్షులు శేఖర్, పార్టీ నాయకులు వెంకటేష్, సిఐటియు ఆటో యూనియన్ నాయకులు వీరేశ్, ఉరుకుందు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శ్రీకృష్ణ ఉపాధ్యక్షులు చిరంజీవి మరియు రమేష్ పాల్గొన్నారు.


News
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో నిమజ్జన ఏర్పాట్లకు చేయాలని పోలీసులను విగ్రహాలు వెళ్లే దారిలో రోడ్లో ఉండే ప్యాచ్ వర్క్ ను తర్వాత గతిన పూర్తి చేయాలని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు, విగ్రహాల ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు ను అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఊరేగింపు జరిగే వీధుల్లో రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక, కంకర అడ్డు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పకడ్బందీ నియంత్రణ చేపట్టాలని పోలీసులకు సూచించారు. కెనాల్ దగ్గర గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులను, మెడికల్ క్యాంప్ ఏఆర్పాటు చేయాలని వైద్యాధికారులకు, నిమజ్జనం సమయంలో క్రేన్లు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పి హేమలత, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News
కుక్క దాడి 10 మందికి గాయాలు

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో 10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.

News
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 28-08-2025

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 19617 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 19412 క్యూసెక్కులు
-
News4 weeks ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News1 day ago
పాము కాటుకు మహిళ మృతి
-
News3 weeks ago
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్
-
News3 weeks ago
ఆటో డ్రైవర్స్ లకు అవగాహన
-
News6 hours ago
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్
-
News6 hours ago
కుక్క దాడి 10 మందికి గాయాలు
-
News3 weeks ago
వికలాంగుల పెన్షన్ దారుల ఆవేదన