Connect with us

News

ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస గుప్తా, ప్రతాప్ ఈరన్న శెట్టి, ఉపాధ్యక్షులు మిరియాల శ్రీధర్ కార్యదర్శి మరియు నాగేష్ కాకుబాల్ ( ఎన్ ఆర్ ఐ ) మాట్లాడుతూ జూన్ 3 తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూల బజార్ వాసవి కళ్యాణ మండపంలో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలు పిల్లలు పెద్దలు వృద్ధులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శుక్ల ఆపరేషన్ కళ్ళకు అత్యాధునిక లెన్స్ కూడా ఉచితంగా అమర్చి కంటి బాధితులకు ఉచిత వసతి భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదోని నుండి కర్నూలు మరియు కర్నూలు నుండి అదోనికి వచ్చేవరకు రవాణా సౌకర్యం కల్పించబడునని అలాగే ఆపరేషన్ చేయించుకునెవారు తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తెల్ల రేషన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు వారి యొక్క సెల్ ఫోన్ నెంబర్ తమ వెంట తప్పకుండా తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షలు ఆపరేషన్లు మందులు ఇవ్వబడునని తెలిపారు. ఈ సమావేశంలో సంగీత, ప్రతాప్ హిమబిందు, వంగదారి గీత, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.

కాలుతున్న పత్తి
మంటలు ఆర్పుతున్న స్థానికులు
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
జెసిబి తో పత్తిని పక్కకు చూస్తున్న ఫోటో
Continue Reading

News

బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష

Published

on

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

డ్రైవర్లను కోర్టు నుంచి జైలుకు తీసుకు వెళ్తున్న పోలీసులు
Continue Reading

News

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.

Continue Reading

Trending