News
ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో శుక్రవారం ఆర్యవైశ్య అఫీషియల్ మరియు ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాస గుప్తా, ప్రతాప్ ఈరన్న శెట్టి, ఉపాధ్యక్షులు మిరియాల శ్రీధర్ కార్యదర్శి మరియు నాగేష్ కాకుబాల్ ( ఎన్ ఆర్ ఐ ) మాట్లాడుతూ జూన్ 3 తేదీ శనివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూల బజార్ వాసవి కళ్యాణ మండపంలో ఉచిత కంటి ఆపరేషన్ల మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆదోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలు పిల్లలు పెద్దలు వృద్ధులందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి శుక్ల ఆపరేషన్ కళ్ళకు అత్యాధునిక లెన్స్ కూడా ఉచితంగా అమర్చి కంటి బాధితులకు ఉచిత వసతి భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆదోని నుండి కర్నూలు మరియు కర్నూలు నుండి అదోనికి వచ్చేవరకు రవాణా సౌకర్యం కల్పించబడునని అలాగే ఆపరేషన్ చేయించుకునెవారు తమ వెంట ఒరిజినల్ ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు తెల్ల రేషన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు వారి యొక్క సెల్ ఫోన్ నెంబర్ తమ వెంట తప్పకుండా తీసుకొని రావాలని విజ్ఞప్తి చేశారు. వైద్య పరీక్షలు ఆపరేషన్లు మందులు ఇవ్వబడునని తెలిపారు. ఈ సమావేశంలో సంగీత, ప్రతాప్ హిమబిందు, వంగదారి గీత, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


