Connect with us

News

కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి. గడ్డా ఫక్రుద్దీన్

Published

on

2025 ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇస్తున్నారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని లో  టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ పత్రిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశారని.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో 16,347 పోస్టులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పేదలకు భోజనాలు పెట్టే 203 అన్న క్యాంటీన్ల, విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,400 కోట్లు సహాయం,  అమరావతి పునః నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖ రైల్వే జోన్ పనులు, తల్లికి వందనం, దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు, మత్య్సకారు లకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు రెట్టింపు  సహాయం, 90% సబ్సిడీ‌పై డ్రిప్ ఇరిగేషన్ ఇలా చెప్పుకుంటు పోతే అనేక పధకాలు ప్రజల కు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. త్వరలో రైతు రుణమాఫీ, 15 ఆగస్టు కి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుందని అన్నారు. మరెన్నో… సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు అమలు చేస్తారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి జి ఎం డి షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్రా డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు

Published

on

తుంగభద్ర డ్యాం. 03 07 2025 గురువారం ఉదయం పనెండు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు డ్యామ్ అధికారులు. రెండు అడుగులు ఎత్తుకు పనెండు గేట్లు ఎత్తి దిగువకు 39611 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తుంగభద్ర డ్యామ్ అధికారులు సమాచారం ఇచ్చారు నది తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర డ్యాం అధికారులు ఆదేశాలు  జారీ చేశారు.
.

తుంగభద్ర డ్యాం 12 గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలిన అధికారులు
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 03-07-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1625.53 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 78.239 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 28500 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 13748  క్యూసెక్కులు

Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 03 07 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 38/- రూపాయలు, రిటైల్: 1kg 40/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 24/- రూపాయలు, రిటైల్: 1kg 26/- రూపాయలు

03 07 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement

Continue Reading

Trending