News
కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి. గడ్డా ఫక్రుద్దీన్
2025 ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధి రెండిటికీ ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇస్తున్నారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని లో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి గడ్డా ఫక్రుద్దీన్ పత్రిక సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెన్షన్ రూ.4 వేలు, దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేశారని.మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తో 16,347 పోస్టులు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పేదలకు భోజనాలు పెట్టే 203 అన్న క్యాంటీన్ల, విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం రూ.11,400 కోట్లు సహాయం, అమరావతి పునః నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుకు రూ.12,500 కోట్లు, విశాఖ రైల్వే జోన్ పనులు, తల్లికి వందనం, దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు, మత్య్సకారు లకు వేట నిషేధ సమయంలో రూ.20 వేలు రెట్టింపు సహాయం, 90% సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ ఇలా చెప్పుకుంటు పోతే అనేక పధకాలు ప్రజల కు కూటమి ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. త్వరలో రైతు రుణమాఫీ, 15 ఆగస్టు కి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తుందని అన్నారు. మరెన్నో… సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు అమలు చేస్తారని టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి జి ఎం డి షేక్ బాబా ఫక్రుద్దీన్ అలియాస్ గడ్డా ఫక్రుద్దీన్ తెలిపారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




