News
కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించకపోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్
కొత్తగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 28, 2023న ప్రారంభించబోతున్నరు.
ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనాన్ని మే 28వ తేదీ నా ప్రారంభించడాని సవాల్ చేస్తూ గురువారం సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది .
రాష్ట్రపతిని ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదు అని న్యాయవాది సీఆర్ జయ సుకిన్ పిటిషన్లో ప్రశ్నించారు. 19 ప్రతిపక్ష పార్టీలు మే 28న ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తూ చేసిన ప్రకటనలను సుప్రీంకోర్టుకు పిటిషన్ లో తెలిపారు. వారు రాష్ట్రపతిని పక్కన పెట్టారని, దీనిని “అవమానం”గా పేర్కొంటూ బహిరంగంగా ఆరోపించారు అని అన్నారు.
“రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరుడు మరియు పార్లమెంటు సంస్థకు అధిపతి. ఆర్టికల్ 85 ప్రకారం, రాష్ట్రపతి ప్రతి పార్లమెంటు సభను సమావేశానికి పిలిపించవచ్చు” అని పిటిషన్లో పేర్కొన్నారు.
“ రాష్ట్రపతి ప్రధానిని నియమిస్తారు” అని ఎత్తి చూపుతూ, గవర్నర్లు, సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల న్యాయమూర్తులు, చీఫ్ ఎలక్షన్ కమీషనర్ మొదలైన రాజ్యాంగపరమైన అధికారులను రాష్ట్రపతి నియమిస్తారని పిటిషన్లో పేర్కొన్నారు.
దేశంలో అత్యున్నత శాసన సభ అయిన పార్లమెంటు ప్రారంభోత్సవం రాష్ట్రపతి లేకుండా “చట్టం ప్రకారం కాదు” అని సుకిన్ అన్నారు.
News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
