News
పరిమితిని మించి ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోండి.. సబ్ కలెక్టర్

రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టండి..
పెండింగ్ లో ఉన్న రోడ్డు మరమ్మత్తుల పనులను త్వరతగతిన పూర్తి చేయండి..
పరిమితిని మించి ప్రయాణించే వాహనాలపై చర్యలు తీసుకోండి.. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్..

రోడ్డు ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో డివిజన్ స్థాయి రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సమీక్షలు జరిగిన రోడ్ సేఫ్టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి ఆరా తీశారు. ముఖ్యంగా డివిజన్ పరిధిలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలని ఆర్&బి అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం వర్షాకాలం ఉన్న నేపథ్యంలో డ్రైనేజ్, మ్యాన్ హోల్ ఎప్పటికప్పుడు శుభ్రపరచి బ్లాక్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ వాటిని గుర్తించి సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పరిమితి నుంచి వాహనాల్లో ప్రయాణించే వాహనాలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. నూతన ట్రాఫిక్ చట్టాలను ప్రజలకు అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి వారిని హాస్పిటల్ కు తీసుకువెళ్లే సమయం జీరో అవర్/ గోల్డెన్ అవర్ వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి రోడ్డు భద్రత చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమానికి పరిపాలన అధికారి కే. వసుంధర, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, ఆర్టీవో నాగేంద్ర, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిసిర దీప్తి, ఆర్ అండ్ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డి. ఎం. హెచ్. వో సత్యవతి, డిఎల్పిఓ కార్యాలయపు పరిపాలన అధికారి వీరభద్రప్ప, మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ

కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం గవి గట్టు గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో నీలకంఠ, బంగారయ్య ఇద్దరికీ గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నీలకంఠ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి పొలం విషయంలో పక్కన పొలంలో ఉన్న ఐదు మంది వ్యక్తులు ఇద్దరు మహిళలతో కలిసి వారిపై దాడి చేశారని తెలిపారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News
సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు.. గడ్డా ఫక్రుద్దీన్

కూటమి నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుపరిపాలనకు కేరాఫ్ గా నిలిచాడని టిడిపి ఎ పి రాష్ట్ర మైనారిటీ సెల్ కార్యదర్శి,గుంతకల్లు మైనారిటీ పరిశీలకుడు గడ్డా ఫక్రుద్దీన్ అన్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో బుదవారం గడ్డా ఫక్రుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలకు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ, ఇవ్వని హామీలను అమలు చేస్తూ ప్రజల చేత మన్ననలు పొందుతున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంటింటా సుపరిపాలన పేరిట గడప గడప కు తిరిగి సమస్యలను తెలుసుకోవడం జరిగిందన్నారు. మంత్రి వర్గంలో తీసుకున్న 9 అంశాలలో బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం అమలు,సత్ప్రవర్తన కలిగి ఉండడంతో 17 మంది జీవిత ఖైదీలకు విముక్తి, రాష్ట్ర వ్యాప్తంగా 2048 ఎస్పీఎఫ్ పోలీసు లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి, ఆటో డ్రైవర్ల తో సమావేశం ఏర్పాటు లాంటి సాహోసపేతమైన నిర్ణయాలు తీసుకున్న పరిపాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.
News
కాలేజ్ ప్రాంగణంలో నెట్వర్క్ టవర్ను తొలగించాలి విద్యార్థి సంఘాల డిమాండ్

కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నెట్వర్క్ టవర్ను వెంటనే తొలగించాలి DSF, PDSO, RPSF విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF జిల్లా అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ RPSF జిల్లా అధ్యక్షుడు బాలు మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యానికి హానికరం అంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.
కాలేజ్ మైదానంలో టవర్ ఉండటం వల్ల విద్యా వాతావరణం ప్రభావితం అవుతోందని వారు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ చొరవ చూపి వెంటనే స్పందించి తక్షణమే టవర్ను తొలగించాలని కోరారు. టవర్ ను తొలగించ లేకపోతే విద్యార్థులు అందరినీ సమీకరించి రానున్న రోజుల్లో బందుకు పిలుపునిస్తామని విద్యార్థి సంఘాలుగా ఆర్ట్స్ కళాశాల మేనేజ్మెంట్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు షకీల్ వినీల్ రాజ్ కుమార్ నవీన్ వినోద్ మురళి తదితరులు పాల్గొనడం జరిగింది

-
News4 weeks ago
స్కూల్ కాలేజీల దగ్గర గుట్కాలు, సిగరెట్లు అమ్మితే చర్యలు
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 09-07-2025
-
News4 weeks ago
తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 10-07-2025
-
News3 days ago
ఆటో అదుపుతప్పి బోల్తా
-
News4 weeks ago
కోట శ్రీనివాసరావు కన్నుమూత
-
News10 hours ago
పొలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
-
News4 weeks ago
ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర