భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్లాస్టిక్ భూతం నుండి సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రిటైర్డ్ డీఎస్పీ కొండారెడ్డి, కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నాగభూషణం, వాకర్స్ కో-ఆర్డినేటర్ న్యాయవాది జీవన్ సింగ్ పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదివారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. గత రెండు వారాలుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, చిన్నారులు, అథ్లెట్లు […]