Connect with us

News

అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆస్పరి బైపాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రశీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారు బిస్కెట్లను సీఐ రాజశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక సెల్ ఫోను, కారు సీజ్ చేశారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాహనాలు తనికి చేస్తుండగా ఫజల్ అనే బంగారు వ్యాపారి వద్ద ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించామని వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు బిల్లులు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత ఇంకమ్ టాక్స్  అధికారులకు అప్పగించామని తెలిపారు. వాటితో పాటు ఒక సెల్ ఫోను కారును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

మీడియాకు వివరాలందిస్తున్న సిఐ రాజశేఖర్ రెడ్డి

News

​భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కలెక్టర్ సిరి

Published

on

ఎమ్మిగనూరు, ఆగస్టు 14: ప్రజల నుంచి అందిన వినతులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, సమస్యలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి స్పష్టం చేశారు. “ఒక్క నెల – ఒక నియోజకవర్గం – నాలుగు పర్యటనలు” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎమ్మిగనూరులోని ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్‌లో కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు.

ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్

అనంతరం ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో 22-A(1) నిషేధిత జాబితా, చుక్కల భూములు తదితర భూ సమస్యలను పరిష్కరించి, సంబంధిత భూ పత్రాలను రైతులకు కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, స్థానిక ఎమ్మెల్యే బి.వి. జయ నాగేశ్వర రెడ్డి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అందజేశారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు ప్రజలు
భూమి పత్రాలను రైతులకు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా, వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి తెలిపారు. 22-ఏ నిషేధిత భూముల తొలగింపు, రీ-సర్వే, ఇనాం భూములు, పట్టా వ్యత్యాసాల వంటి రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ గృహాలు, పింఛన్లు, తాగునీరు తదితర సంక్షేమ ఫలాలు సకాలంలో చేరేలా అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని అన్నారు.

భూమి పత్రాలను రైతులకు అందజేస్తున్న జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో ఆర్డీవో అరుణ దేవి, డీపీవో భాస్కర్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, జిల్లా అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న జిల్లా కలెక్టర్
Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 14.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 14 (శుక్రవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1628.75 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 89.442 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 27897 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 25197 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 4665 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 88396 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

ఆదోనిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

Published

on

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహించే ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆదోని నియోజకవర్గంలో జాతీయ జెండా ర్యాలీ అత్యంత ఘనంగా నిర్వహించారు.

ర్యాలీలో పాల్గొన్న ఆర్డీవో

​కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి మునిసిపల్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు మరియు ప్రజలు జాతీయ జెండాలను చేతిలో పట్టుకుని ఊరేగింపుగా సాగారు. “భారత్ మాతాకీ జై” స్లోగన్లతో ఆదోని పుర వీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో ఆదోని ఆర్డీఓ (RDO) కె. అరుణాదేవి, ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్ నయూమ్, అసిస్టెంట్ కమిషనర్ లతో పాటు మున్సిపల్ సిబ్బంది, బీజేపీ మరియు కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ​ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, దేశభక్తి స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు.

Continue Reading

Trending