Connect with us

News

అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆస్పరి బైపాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రశీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారు బిస్కెట్లను సీఐ రాజశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక సెల్ ఫోను, కారు సీజ్ చేశారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాహనాలు తనికి చేస్తుండగా ఫజల్ అనే బంగారు వ్యాపారి వద్ద ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించామని వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు బిల్లులు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత ఇంకమ్ టాక్స్  అధికారులకు అప్పగించామని తెలిపారు. వాటితో పాటు ఒక సెల్ ఫోను కారును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

మీడియాకు వివరాలందిస్తున్న సిఐ రాజశేఖర్ రెడ్డి

News

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో టూ టౌన్ పోలీసులు సుమారు 30 లక్షలు విలువ చేసే 35 టు వీలర్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సిఐ తెలిపిన వివరాల మేరకు వాహనాలు తనిఖీలు చేస్తుండగా మంత్రాలయం నియోజకవర్గం చిన్న తుంబలం గ్రామానికి చెందిన వడ్డే మహేష్ అనే వ్యక్తి ని అనుమానంతో అపి విచారించగా తాను చోరీ చేసుకుని వెళ్తున్న వాహనమని గుర్తించి అతన్ని విచారించగా వడ్డే మహేష్ నుంచి నుంచి చోరీ అయిన సుమారు 30 లక్షల విలువచేసే 35 బైక్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వడ్డే మహేష్ కుమార్ ని అరెస్టు చేసి రిమైండ్ కి తరలించిన టూటౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

సీజ్ చేసిన 35 వాహనాలు
సీజ్ చేసిన 35 వాహనాలు
మీడియాతో మాట్లాడుతున్న సిఐ రాజశేఖర్ రెడ్డి
Continue Reading

News

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని టూ టౌన్ పోలీసుల వాహన తనిఖీల్లో అక్రమంగా ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం చేసుకున్నారు. టూ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు ఆదోని నుంచి ఎమ్మిగనూరుకు అక్రమంగా తరలిస్తున్న షేక్ షాకీర్ , అక్షయ్ జాదవ్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. వెండి బిస్కెట్లకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో వెండిని ఇన్కమ్ టాక్స్ అధికారులకు అప్పజెప్తామని సిఐ తెలిపారు.

Continue Reading

News

సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం

Published

on

ఆదోని 23-06-2026 మధ్యాహ్నం 12 గంటలకు ఆకాశంలో సూర్యుని చుట్టూ ఏర్పడిన వలయం.. మీరు ఫోటోలో చూస్తున్నది ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన ఖగోళ దృగ్విషయం. దీనిని సూర్య పరివేషం (Solar Halo) లేదా 22-డిగ్రీల హాలో (22° Halo) అని పిలుస్తారు. పాతకాలంలో దీనిని చూసి వర్షం పడే సూచనగా భావించేవారు, ఎందుకంటే ఈ రకమైన మేఘాలు సాధారణంగా వాతావరణంలో మార్పును లేదా వర్షాన్ని సూచిస్తాయి.

​ఇది ఎలా ఏర్పడుతుందో ఇక్కడ చూద్దాం:

  • మంచు స్ఫటికాలు (Ice Crystals): ఆకాశంలో చాలా ఎత్తులో ఉండే సిరస్ (Cirrus) మేఘాలలో మిలియన్ల కొద్దీ చిన్న చిన్న షడ్భుజి (hexagonal) ఆకారపు మంచు స్ఫటికాలు ఉంటాయి.
  • కాంతి వక్రీభవనం (Refraction): సూర్యకాంతి ఈ మంచు స్ఫటికాల గుండా ప్రయాణించినప్పుడు, అది వంగి (refract అయి) దాదాపు 22 డిగ్రీల కోణంలో విడిపోతుంది.
  • ఇంద్రధనస్సు లాంటి వలయం: ఇలా వక్రీభవనం చెందిన కాంతి సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయంలా (రింగ్ లా) మనకు కనిపిస్తుంది. దీని అంచులలో కొద్దిగా ఇంద్రధనస్సు రంగులు కూడా కనిపిస్తాయి.
యూట్యూబ్ వీడియో
Continue Reading
News6 hours ago

అదోనిలో 30 లక్షలు విలువ చేసే 35  బైక్లు స్వాధీనం

News6 hours ago

అదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం

News16 hours ago

సూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం

News4 weeks ago

ఆదోని లో 10 లక్షల విలువైన 12 బైక్‌లు స్వాధీనం

News4 weeks ago

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

News1 month ago

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఏఈవో!

News2 months ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

రైతులు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై పొందవచ్చు: ఆదోని మండల వ్యవసాయ అధికారి

News2 months ago

భార్యను పంపడం లేదని సెల్ టవర్ ఎక్కిన భర్త

News2 months ago

క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే పీడీ యాక్ట్: ఆదోని వన్ టౌన్ సీఐ హెచ్చరిక

Trending