Connect with us

News

అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆస్పరి బైపాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రశీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారు బిస్కెట్లను సీఐ రాజశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక సెల్ ఫోను, కారు సీజ్ చేశారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాహనాలు తనికి చేస్తుండగా ఫజల్ అనే బంగారు వ్యాపారి వద్ద ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించామని వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు బిల్లులు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత ఇంకమ్ టాక్స్  అధికారులకు అప్పగించామని తెలిపారు. వాటితో పాటు ఒక సెల్ ఫోను కారును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

మీడియాకు వివరాలందిస్తున్న సిఐ రాజశేఖర్ రెడ్డి

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 12.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 12 (బుధవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1627.61 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 85.359 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 34051 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 31431 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1680 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 87.123 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

​అదోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

Published

on

◆ ​కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు ◆ రామ్‌జలా, జైన్ టెంపుల్, పెద్దతుంబలం రామాలయం సందర్శన ◆ మౌలిక వసతుల కల్పనకు త్వరలోనే ప్రతిపాదనలు

రామ్ జల చెరువును పరిశీలిస్తున్న ఆర్డీవో మరియు అధికారులు

కర్నూలు జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత కల్పించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాల తో అదోని డివిజన్ ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక ప్రదేశాలను మంగళవారం అదోని ఆర్డీఓ వివిధ శాఖల అధికారులు ఉమ్మడిగా పర్యటన నిర్వహించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన రామ్‌జలా, జైన దేవాలయం, పెద్దతుంబలం ప్రాచీన రామాలయం, చిన్నతుంబలం చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి, అక్కడి ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డీవో

పర్యాటకులను ఆకర్షించేలా చేపటాల్సిన అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా అధికారులు చర్చించారు. ముఖ్యంగా ​మెరుగైన రహదారి సౌకర్యాలు, తాగునీటి సరఫరా పరిసరాల పారిశుధ్యం, వ్యర్థాల నియంత్రణ, ​సందర్శకుల కోసం ప్రయాణ, విశ్రాంతి సౌకర్యాలు​ఆయా ప్రాంతాల చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కాపాడుతూ పర్యాటకులకు అనుకూలంగా అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి ఈ ప్రదేశాలలో అభివృద్ధి పనులను గుర్తించి, సమగ్ర నివేదికలు ఉన్నతాధికారులకు పంపనున్నట్లు అధికారులు తెలిపారు.

అధికారులతో మాట్లాడుతున్న ఆర్డిఓ

​ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో అదోని ఆర్డీఓతో పాటు ఎంఆర్‌ఓ (తహశీల్దార్), మున్సిపల్ కమిషనర్, జిల్లా పర్యాటక శాఖ అధికారులు, దేవాదాయ శాఖ అధికారులు మరియు యంగ్ ప్రొఫెషనల్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

ఆదోని విశ్వనారాయణ కళాశాల ఎదుట PDSU ధర్నా

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతి​ఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు […]

Published

on

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విశ్వనారాయణ కళాశాల ఎదుట ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షుడు అఖండ, మండల అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విశ్వనారాయణ కళాశాల యాజమాన్యం ఒకే భవనంలో ఇంటర్, ఒకేషనల్, పల్లవి పారామెడికల్ కళాశాలలను నడుపుతోందని మండిపడ్డారు. పారామెడికల్ కళాశాలకు అనుమతి​ఎస్.కె.డి కాలనీ చిరునామాతో పొంది, అధికారుల కళ్లు గప్పి విశ్వనారాయణ కాలేజీ బిల్డింగ్‌లోనే తరగతులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పారామెడికల్ బోర్డు అనుమతి పత్రం (పర్మిషన్ బోర్డు) కూడా లేకుండానే విద్యార్థుల వద్ద భారీగా ఫీజులు వసూలు చేశారని తెలిపారు. కాలేజీ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తరగతులు ప్రారంభించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు.

విశ్వ నారాయణ కళాశాల ఎదుట ఆందోళన చేస్తున్న పిడిఎస్యు నాయకులు

​అంతేకాకుండా తరగతులు జరుగుతున్న సమయంలోనే అదే భవనంపై నిర్మాణాలు (కన్స్ట్రక్షన్) చేపడుతున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న విశ్వనారాయణ కళాశాలపై ఇంటర్మీడియట్ బోర్డు, ఏపీ పారామెడికల్ బోర్డు అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పి.డి.ఎస్.యు మండల నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

విశ్వ నారాయణ కళాశాల ఎదుట బైఠాయించిన పిడిఎస్యు నాయకులు
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading

Trending