Connect with us

News

అదోనిలో 60 లక్షల బంగారు స్వాధీనం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు ఆస్పరి బైపాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా రశీదు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 600 గ్రాముల బంగారు బిస్కెట్లను సీఐ రాజశేఖర్ స్వాధీనం చేసుకున్నారు. వాటితోపాటు ఒక సెల్ ఫోను, కారు సీజ్ చేశారు. సిఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాహనాలు తనికి చేస్తుండగా ఫజల్ అనే బంగారు వ్యాపారి వద్ద ఆరు బంగారు బిస్కెట్లు గుర్తించామని వాటికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు బిల్లులు చూపించకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని సంబంధిత ఇంకమ్ టాక్స్  అధికారులకు అప్పగించామని తెలిపారు. వాటితో పాటు ఒక సెల్ ఫోను కారును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు.

మీడియాకు వివరాలందిస్తున్న సిఐ రాజశేఖర్ రెడ్డి

News

విశ్వనారాయణ కళాశాలపై చర్యలు తీసుకోవాలి: పిడిఎస్‌యు డిమాండ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని : ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న విశ్వనారాయణ కళాశాలపై విద్యాశాఖ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) డిమాండ్ చేసింది. స్థానిక కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున మాట్లాడారు.

స్థానిక కార్యాలయంలో మాట్లాడుతున్న నాయకులు

ఇంటర్ బోర్డు నిబంధనలను తుంగలో తొక్కి ఒకే భవనంలో సాధారణ ఇంటర్, ఒకేషనల్ కోర్సులు నడుపుతున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా కళాశాల నడుస్తోందన్నారు. తరగతులు జరుగుతుండగానే భవన నిర్మాణాలు చేపడుతున్నారని, ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు బసవ, విష్ణు, ముని, గోవర్ధన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

News

మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. సాయి ప్రసాద్ రెడ్డి

కర్నూలు జిల్లా ఆదోని: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, యూత్ విభాగం, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… మెగా డీఎస్సీ నిర్వహణపై అనేక అనుమానాలు, […]

Published

on

కర్నూలు జిల్లా ఆదోని: వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదోనిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, యూత్ విభాగం, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

దీక్షలో పాల్గొన్న నాయకులు

​ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… మెగా డీఎస్సీ నిర్వహణపై అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నందున దీనిపై స్వతంత్ర సంస్థ అయిన సీబీఐచే సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తప్పు జరగకపోతే సీబీఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. విద్యాశాఖ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు.

దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ ప్రధాన డిమాండ్లు: ◆ సీబీఐ విచారణ: మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి, ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి. ◆ ​నిరుద్యోగ భృతి: ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు ₹3,000 భృతిని వెంటనే విడుదల చేయాలి. ◆ ఫీజు రీయింబర్స్‌మెంట్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆదుకోవాలి.

దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

​ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగులు, విద్యార్థుల తరఫున పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు వెంకటేష్ రెడ్డి, జీవన్ సింగ్, ఫయాజ్ అహ్మద్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ స్థానిక నాయకులు, కౌన్సిలర్లు, అనుబంధ సంఘాల ప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 08.08.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 08 (శనివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1623.68 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 72.264 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున   42114 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 40750 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1514 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 78.634 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending