News
ఆదోనిలో కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పర్యటన
కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ మరియు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ ఆదోని లో పర్యటించారు. ముందుగా శ్రీ మహాయోగి లక్ష్మమ్మ అవ్వను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి పెద్దలు దేవాలయంలో తీర్థ, ప్రసాదాలు అవ్వ వారి శేష వస్త్రం కప్పి ఫలమంత్రాక్చితలు ఆశీర్వాదించారు. అనంతరాం రాష్ట్రంలో అతి పురాతన షాహి జామియా మసీదును సందర్శించారు. అనంతరం ఖతీబ్ జునైద్ హష్మీ ప్రత్యేక ప్రార్థనలు చేసి మజీద్ పెద్దలు జిల్లా ఎస్పీ ను మరియు ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ని శాలువా మరియు పూలమాల తో సన్మానించారు.


అక్కడి నుండి జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదోని మున్సిపల్ కార్యాలయం మీటింగ్ కాన్ఫరెన్స్ హాల్లో జూన్ 29న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా ఆయా మత పెద్దల తో పీస్ (శాంతి) కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ చైర్మన్ శాంత, ఆదోని డీఎస్పీ శివ నారాయణ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శిశిర దీప్తి, తహశీల్దారు వెంకటలక్ష్మి, తదితరులు అధికారులు పాల్గొన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




