Connect with us

News

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి.. సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.

Published

on

బైజూస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్ ని ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జగనన్న 2వ విడత ఉచిత బైజూస్ ట్యాబ్ లను విద్యార్థులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రాక్టర్ మధుసూదన్ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ట్యాబ్లను పంపిణీ చేశారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థి దశలోనే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మేము చదివే రోజుల్లో ఇటువంటి అవకాశాలు ఉండేవి కాదు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సబ్ కలెక్టర్ సూచించారు.
ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యా రంగానికి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా చేశారన్నారు. ఇంగ్లీష్ మీడియం తో ప్రపంచం తో పోటీ చేసే విధంగా మన విద్యార్థులు కావాలని ఇంగ్లీష్ మీడియాని ఏర్పాటు చేశారన్నారు.
ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ… విద్యా వైద్య రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టారన్నారు. సాధారణ విద్యార్థులకు కూడా విదేశీ విద్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నారు. మరియు ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షలు ఉన్న పరిమితిని 25 లక్షల వరకు వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. జగనన్న సివిల్ ప్రోత్సాహం ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆర్థికమైన సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కే శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంఈఓ శివ రాముడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాబ్ లను చూపిస్తున్న విద్యార్థులు
సమావేశంలో పాల్గొన్న విద్యార్థినీలు
సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు
యూట్యూబ్ వీడియో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

ఆదోని 09-01-2026:

కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు

09 01 26 రైతు బజార్ ధరల పట్టిక
అడ్వర్టైజ్మెంట్
Continue Reading

News

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక

Published

on

వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్‌ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.

Continue Reading

News

కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.

కాలుతున్న పత్తి
మంటలు ఆర్పుతున్న స్థానికులు
మంటలను ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
జెసిబి తో పత్తిని పక్కకు చూస్తున్న ఫోటో
Continue Reading

Trending