Connect with us

News

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి.. సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ.

Published

on

బైజూస్ కంటెంట్ తో ఉన్న ట్యాబ్ ని ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పేర్కొన్నారు.
కర్నూలు జిల్లా ఆదోని నెహ్రూ మెమోరియల్ స్కూల్లో జగనన్న 2వ విడత ఉచిత బైజూస్ ట్యాబ్ లను విద్యార్థులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్సీ ట్రాక్టర్ మధుసూదన్ సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ట్యాబ్లను పంపిణీ చేశారు. మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… విద్యార్థి దశలోనే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. మేము చదివే రోజుల్లో ఇటువంటి అవకాశాలు ఉండేవి కాదు ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సబ్ కలెక్టర్ సూచించారు.
ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చి విద్యా రంగానికి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారన్నారు. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తల్లిదండ్రులకు విద్య భారం కాకుండా చేశారన్నారు. ఇంగ్లీష్ మీడియం తో ప్రపంచం తో పోటీ చేసే విధంగా మన విద్యార్థులు కావాలని ఇంగ్లీష్ మీడియాని ఏర్పాటు చేశారన్నారు.
ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ… విద్యా వైద్య రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టారన్నారు. సాధారణ విద్యార్థులకు కూడా విదేశీ విద్య ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తున్నారు. మరియు ఆరోగ్యశ్రీ ద్వారా ఐదు లక్షలు ఉన్న పరిమితిని 25 లక్షల వరకు వైద్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. జగనన్న సివిల్ ప్రోత్సాహం ద్వారా క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఆర్థికమైన సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కే శాంత, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, ఎంఈఓ శివ రాముడు తదితరులు పాల్గొన్నారు.

ట్యాబ్ లను చూపిస్తున్న విద్యార్థులు
సమావేశంలో పాల్గొన్న విద్యార్థినీలు
సమావేశంలో పాల్గొన్న విద్యార్థులు
యూట్యూబ్ వీడియో
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్‌మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పరీక్షలు నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు
సంతకం చేస్తున్న కౌన్సిలర్ ఫయాజ్
Continue Reading

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

Trending