News
నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి- నూర్ అహ్మద్

నకిలీ విత్తనాలు అమ్మేవారిని ఉరితీయాలి ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు.
కర్నూలు జిల్లా అదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నూర్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవటం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ప్రజల గుండెలను పిండేస్తున్నాయని. కాని ఇదేదో చిన్నపాటి మోసమే అన్నట్లు అధికారులు చిన్న చిన్న కేసులు పెట్టి చేతులు దులుపుకోవటం మరింత విస్మయం కలిగించే విషయం అన్నారు. కావున మన అన్నదాతలకు సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కొన్ని కఠిన చట్టాలను తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదోని జిల్లా సమితి తరపున డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాలను తయారు చేసే వారు, అమ్మేవారు ప్రత్యక్షంగా రైతుల ఆత్మహత్యలకు, వారి కుటుంబాలు రోడ్డున పడటానికి కారకులు అవుతున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రజలకు అవసరమైన పంటలు కొరత ఏర్పడుటకు కారణమౌతున్నారు. దేశాభివృద్ధి కుంటుపడటంలో పరోక్ష పాత్ర వహిస్తూ దేశద్రోహానికి పాల్పడుతున్నారని కావున నకిలీ విత్తనాలు తయారీదారులు,అమ్మకందారులను ఉరిశిక్ష విధించే చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తయారు చేసి అమలు చేయాలి అని నకిలీ విత్తనాలను తయారు చేసే వారు, అమ్మేవారి ఆస్తులను జప్తు చేసి వాటిని నకిలీ విత్తనాల వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని భవిష్యత్తులో నకిలీ విత్తనాలు తయారు చేయాలి, అమ్మాలి ఆలోచన వస్తే వెన్నులో వణుకుపుట్టాలి ప్రభుత్వాన్ని కోరారు.
అదేవిధంగా వీరిని కాపాడేందుకు రాజకీయ నాయకులు గాని ఇతరులు గాని ముందుకు రావటం సిగ్గు చేటు, వీరు రైతు ద్రోహులు. కావున సందట్లో సడేమియాలా బ్రోకర్లలా మధ్యలో దూరి నకిలీ విత్తనాల ద్రోహులను కాపాడేవారు మారాలని లేని పక్షంలో వారు భవిష్యత్తులో నీఛులుగా గుర్తింపబడతారు అని తెలిపారు. మనుషులు, చట్టాలు శిక్షించకున్నా దేవుని శిక్షకు వీరు గురికాక తప్పదని హెచ్చరిచారు.
కావున రైతులు ఉసురు పోసుకోవద్దని ఆదోని జిల్లా సమతి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ.నూర్ అహ్మద్ హితవుపలికారు. ఈ కార్యక్రమంలో ఆదోని జిల్లా సమితి రూరల్ నాయకులు పి.వి. కుబేర స్వామి పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు