News
జర్నలిస్టులకు అండగా ఏపీడబ్ల్యూజేఎఫ్
రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కులను కాపాడుతూనే వారికి అండగా ఉండడమే ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ లక్ష్యమని ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి మద్దిలేటి తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోనిలో గురువారం బీమాస్ హాల్లో ఆదోని నియోజకవర్గం అధ్యక్షుడు బసవరాజు అధ్యక్షతన ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జర్నలిస్టులకు సకాలంలో అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని, ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరు చేసి ప్రభుత్వమే గృహం నిర్మించేలా చూడాలన్నారు హెల్త్ కార్డులకు ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అహర్నిశలు కృషిచేస్తుందన్నారు మండల, నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసి త్వరలోనే జిల్లా మహాసభలు నిర్వహించి ఫెడరేషన్ ను క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తామన్నారు ప్రతి ఒక్కరూ ఫెడరేషన్ సభ్యత్వం తీసుకోవాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఫెడరేషన్ గౌరవాధ్యక్షుడు నాగరాజ్, కార్యదర్శి మునెప్ప, ఉపాధ్యక్షులు ఉరుకుందప్ప, మురళి, వార్త బీమా, మహా న్యూస్ రఘునాథ్ రెడ్డి, చంద్ర, బి ఆర్ కె న్యూస్ వీరేష్, సుంకన్న పాల్గొన్నారు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




