Connect with us

News

ఆదోనిలో చదివే అమ్మాయికి అమెరికాకు వెళ్లే ఛాన్స్

Published

on

కర్నూలు జిల్లా ఆదోని కస్తూరిబా స్కూల్లో చదువుకున్న విద్యార్థిని శివలింగమ్మ 10వ తరగతిలో 541 మార్కులతో పాస్ అయినందుకు ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించే అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకుంన్న శివలింగమ్మ శనివారం ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ని కలిసి ఆశీర్వాదం పొంది తనకు ఈ అవకాశం వచ్చినందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపింది.
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ కౌతాళం మండలం పొదలకుంట గ్రామానికి చెందిన సోమనాథ్ గంగమ్మ నాలుగో సంతానం శివలింగమ్మ అమెరికా వెళ్లి ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే ఆరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోవడమే ఈ అమ్మాయి సాధించిన గొప్ప విజయం అని అభినందనలు తెలిపారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపు తో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులను అమెరికాలోని అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశం, కొలంబియా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రాధిక అయ్యంగార్ తో మీటింగ్ తోపాటు వరల్డ్ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో ప్రతినిధులతో సమావేశం, వైట్ హౌస్ సందర్శన కల్పించారు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో విద్యా విధానంలో సమూలమైన మార్పులు విద్యారంగంలో సంస్కరణ లపై ఐక్యరాజ్యసమితిలో మాట్లాడేందుకు విద్యార్థులను అమెరికా పంపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు

అమెరికా వెళ్లి అమ్మాయికి అభినందనలు తెలుపుతున్న ఎమ్మెల్యే
తన వంతు ఆర్థిక సహాయం అందిస్తున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

News

గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టండి.. ఆదోని సబ్ కలెక్టర్

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. గురువారం ఆదోని పట్టణంలో  నిమజ్జనం వెళ్లే ప్రధాన దారి అయినా , తిక్క స్వామికి దర్గా, ఎమ్మిగనూరు సర్కిల్, బీమా సర్కిల్, ఫరిసా మోహల్ల, శ్రీనివాస్ భవన్, గణేష్ సర్కిల్, న్యూ ఫ్లైవర్, వినాయక ఘాట్ ప్రధాన దారులను తనిఖీ చేసి పరిశీలించారు.

వినాయక కాటు వద్ద పరిశీలిస్తున్న అధికారులు

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నిమజ్జనం కు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా గణేష్ విగ్రహాల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తుతో నిమజ్జన ఏర్పాట్లకు చేయాలని పోలీసులను విగ్రహాలు వెళ్లే దారిలో రోడ్లో ఉండే ప్యాచ్ వర్క్ ను తర్వాత గతిన పూర్తి చేయాలని కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు, విగ్రహాల ఊరేగింపు సమయంలో  విద్యుత్ తీగలు, కేబుల్ వైర్లు ను అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఊరేగింపు జరిగే వీధుల్లో రోడ్డు కన్స్ట్రక్షన్ సంబంధించిన ఇసుక, కంకర అడ్డు లేకుండా చూసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. నిమజ్జనం సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా పకడ్బందీ నియంత్రణ చేపట్టాలని పోలీసులకు సూచించారు. కెనాల్ దగ్గర గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులను, మెడికల్ క్యాంప్ ఏఆర్పాటు చేయాలని వైద్యాధికారులకు, నిమజ్జనం సమయంలో క్రేన్లు గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో ఉంచుకొని  ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం విజయవంతం చేయాలని సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు.

అధికారులకు ఆదేశాలు ఇస్తున్న సబ్ కలెక్టర్


ఈ కార్యక్రమంలో డిఎస్పి హేమలత, తాసిల్దార్ రమేష్, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మనాభ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

వినాయక ఘాటు వద్ద అధికారులతో సబ్ కలెక్టర్
Continue Reading

News

కుక్క దాడి 10 మందికి గాయాలు

Published

on

కర్నూలు జిల్లా ఆలూరు మండలం హత్తిబెలగల్ గ్రామంలో పిచ్చికుక్క గ్రామస్తులపై దాడి చేయడంతో  10 మందికి గాయాలు అయ్యాయి. అందులో ఇద్దరికీ మస్తాన్ సాబ్ (68), గౌతమ్ (8) కు తీవ్ర గాయాలు కావడంతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  మిగిలిన 8 మందిని ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బాధ్యులు తెలిపారు.

ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మస్తాన్ షాప్
మస్తాన్ తెలిపిన వివరాలు
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 28-08-2025

Published

on

By

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 19617 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 19412 క్యూసెక్కులు

Continue Reading

Trending