Connect with us

News

మే 22 కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి.. వ్యవసాయ కార్మిక సంఘం

Published

on

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్విరం చేసి ఉపాధి కూలీలకు దక్కకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలుగా మనందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న తెలిపారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలమంచి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ రెండు పూటల పని విధానాన్ని మరియు ఆన్లైన్ మాస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోని పనులు కొనసాగించాలని, పని దగ్గర నీళ్లు, నీడ టెంటు మెడికల్ కిట్లు, లాంటి సౌకర్యాలు కల్పించాలని, సమ్మర్ అలవెన్స్ 50% ఇవ్వాలని, గడ్డపార సాన పెట్టుకోవడానికి 50 రూపాయలు, 600 రూపాయలు వేతనం 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్లపై మే 22న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న కూలీలకు పిలుపునిచ్చారు.

కూలీలకు పిలుపునిస్తున్న లింగన్న
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 10.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 10 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1625.82 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 79.201 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 43022 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 42450 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1757 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 84.456 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

హై డ్రామా కు తెరలేపిన ఆదోని ఎమ్మెల్యే

Published

on

కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి హైడ్రామాకు తేరలైపోయారు. డీఎస్సీ నియామకాల్లో ఎటువంటి అవకతవకలు జరగలేదని అవకతవకలు జరిగి ఉంటే బహిరంగ చర్చలకు సిద్ధమా అని వైసిపి నాయకులకు ఎమ్మెల్యే పార్థసారథి సవాల్ విసిరారు. దీనికి వైసిపి నాయకులు స్వీకరించి బహిరంగ చర్చలకు సిద్ధమని తెలపడంతో ఐదు గంటలకు వస్తాను అన్న పార్థసారధి కొద్ది దూరం వచ్చి తర్వాత పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు రోడ్డుపై హైడ్రామా చేసి వెన్ను తిరిగి వెళ్ళిపోయారు.

మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి ముందుకు చేరుకున్న వైసిపి నాయకులు కార్యకర్తలు
పూర్తి వీడియో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

నిజంగా అవకతవకలు జరగలేదంటే మేము చర్చలకు ఎక్కడికైనా సిద్ధమని వైసిపి నాయకులు తేల్చి చెప్పారు. ఆదోని ఎమ్మెల్యే పై ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్, వైఎస్ఆర్సిపి పట్టణ గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి మండిపడ్డారు.

పోలీస్ జీప్ లో ఎక్కించే ప్రయత్నం చేస్తున్న సీఐ
ఎమ్మెల్యే తో మాట్లాడుతున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించిన ఎమ్మెల్యే
Continue Reading

News

తుంగభద్ర డ్యామ్ కు భారీగా పెరుగుతున్న వరద నీరు

Published

on

హోస్పేట: 09.08.0226: తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఆగస్టు 09 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1624.74 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 75.644 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు: ◆ ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 40799 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 40500 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. ◆ అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 1525 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1626.06 అడుగులుగా ఉండగా.. 80.003 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 81.538 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

Trending