జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్విరం చేసి ఉపాధి కూలీలకు దక్కకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలుగా మనందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న తెలిపారు.
కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలమంచి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ రెండు పూటల పని విధానాన్ని మరియు ఆన్లైన్ మాస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోని పనులు కొనసాగించాలని, పని దగ్గర నీళ్లు, నీడ టెంటు మెడికల్ కిట్లు, లాంటి సౌకర్యాలు కల్పించాలని, సమ్మర్ అలవెన్స్ 50% ఇవ్వాలని, గడ్డపార సాన పెట్టుకోవడానికి 50 రూపాయలు, 600 రూపాయలు వేతనం 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్లపై మే 22న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న కూలీలకు పిలుపునిచ్చారు.