Connect with us

News

మే 22 కలెక్టరేట్ ముందు ధర్నాను జయప్రదం చేయండి.. వ్యవసాయ కార్మిక సంఘం

Published

on

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్విరం చేసి ఉపాధి కూలీలకు దక్కకుండా చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూలీలుగా మనందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న తెలిపారు.

కర్నూలు జిల్లా ఆదోని మండలం జాలమంచి గ్రామంలో గురువారం ఉపాధి హామీ కూలీలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ రెండు పూటల పని విధానాన్ని మరియు ఆన్లైన్ మాస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతిలోని పనులు కొనసాగించాలని, పని దగ్గర నీళ్లు, నీడ టెంటు మెడికల్ కిట్లు, లాంటి సౌకర్యాలు కల్పించాలని, సమ్మర్ అలవెన్స్ 50% ఇవ్వాలని, గడ్డపార సాన పెట్టుకోవడానికి 50 రూపాయలు, 600 రూపాయలు వేతనం 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్లపై మే 22న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు లింగన్న కూలీలకు పిలుపునిచ్చారు.

కూలీలకు పిలుపునిస్తున్న లింగన్న
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు

Published

on

ఏపీలో SIR గడువును పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఇవాల్టితో గడువు ముగియనుండగా కొన్నిచోట్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ఈ నెల 24 వరకు గడువును పొడిగిస్తున్నట్లు తెలిపింది.

Continue Reading

News

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 13.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 13 (సోమవారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1602.0 అడుగులకు చేరుకుంది. మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 24.355 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 17152 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 16807 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 652 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.23 అడుగులుగా ఉండగా.. 77524 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 38071 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading

News

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

Published

on

హోస్పేట: 12.07.0226:

తుంగభద్ర జలాశయానికి ఎగువ ప్రాంతాల నుండి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. జులై 12 (ఆదివారం) ఉదయానికి అందిన అధికారిక వివరాల ప్రకారం.. డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 1601.08 అడుగులకు చేరుకుంది.మొత్తం 105.788 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్థ్యం కలిగిన ఈ జలాశయంలో ప్రస్తుతం 22.948 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ప్రవాహాల వివరాలు:

  • ఇన్‌ఫ్లో (వరద నీటి రాక): గత 24 గంటల్లో సగటున 25,120 క్యూసెక్కుల చొప్పున వరద నీరు వచ్చి చేరుతుండగా, ప్రస్తుతం లైవ్ ఇన్‌ఫ్లో 19,642 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
  • అవుట్‌ఫ్లో (నీటి విడుదల): జలాశయం నుండి ప్రస్తుతం కాల్వల ద్వారా కేవలం 381 క్యూసెక్కుల నీటిని మాత్రమే బయటకు వదులుతున్నారు. నదికి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదు.
  • ఎగువన ప్రవాహాలు: తుంగా రిజర్వాయర్ నుండి 6,621 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది.

గత ఏడాదితో పోలిస్తే.. గతేడాది ఇదే సమయానికి తుంగభద్ర డ్యామ్‌లో భారీగా నీటి నిల్వలు ఉన్నాయి. పోయినేడు ఇదే రోజున డ్యామ్ నీటి మట్టం 1625.13 అడుగులుగా ఉండగా.. 76.912 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అలాగే గత పదేళ్ల సగటు నీటి నిల్వను పరిశీలిస్తే ఈ సమయానికి 36.254 టీఎంసీలు ఉండేదని, ప్రస్తుతానికి గతేడాది కంటే నీటి నిల్వలు కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ.. ఎగువ నుండి వస్తున్న ఇన్‌ఫ్లో కారణంగా నీటి మట్టం వేగంగా పెరుగుతోందని టీబీ బోర్డు సెక్షన్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Continue Reading
News2 days ago

BREAKING ఏపీలో సర్ గడువు 24 వరకు పొడిగింపు

News3 days ago

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

News4 days ago

తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న నీటి నిల్వ

News5 days ago

పేద కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం

News6 days ago

నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్

News6 days ago

కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..

News7 days ago

ఆదోని మున్సిపల్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు

News7 days ago

ఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్‌గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు

News7 days ago

ఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి

News1 week ago

వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్

Trending