News
రోడ్లపై పశువులను వదిలితే క్రిమినల్ చర్యలు
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కమిషనర్ వారి హెచ్చరిక రోడ్లపై పశువులు తిరుగుట వలన ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ వాహనాలు నడిపే వారికి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనివల్ల చాలామంది గాయాలపాలు అయ్యారు.. మరి కొంతమంది ప్రాణాలు పోయాయి. ఈ ప్రమాదాలకు కారణమైన పశువుల యజమాను లు బాధ్యత రహితంగా నిర్వహిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ కమిషనర్ తెలిపిన వివరాల మేరకు పశువుల యజమానులకు అనేకసార్లు సమావేశములు ఏర్పాటు చేసి వారి పశువులను రోడ్లు మీదకు వదలకుండా జాగ్రత్తలు తీసుకొనవలని హెచ్చరించిన పశువుల యజమానులు పూర్తిగా నిర్లక్ష్యం చేసి పశువులను యధేచ్చగా రోడ్ల మీదకు వదలటం జవాబుదారీతనం లేకపోవడం వలన యాక్సిడెంట్ జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా యంత్రాంగం, ఆదోని పురపాలక సంఘము యంత్రాంగం ఆదేశాముల మేరకు పశువులు రోడ్లపై కనబడితే ఎటువంటి నోటీసు ఇవ్వకుండా పశువులను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న పశువులపై పశువుల యజమానులకు ఎటువంటి హక్కులు వుండవని తెలిపారు. పశువుల యజమానులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



News
ఆదోని జిల్లా కోసం ఐదు నియోజకవర్గ లు బంద్
ఆదోని జిల్లా చేయాలనే డిమాండ్కు మద్దతుగా JAC (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఆదోని బందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా 𝐘𝐒𝐑𝐂𝐏 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మునిసిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మీడియా తో మాట్లాడుతూ పార్టీ లకు అతీతంగా, కుల, మత భేదాలు లేకుండా ఆదోని జిల్లా సాధన లక్ష్యంగా ప్రజలంతా ఏకమై ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలిపారు. “ఆదోని జిల్లా – మన హక్కు” అనే నినాదంతో బందు కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించారని అన్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
