News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా వెల్లాల మధుసూధనశర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఇందులో నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ, ప్రధానకార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమశర్మ(తెనాలి) , కోశాధికారిగా శ్రీ కౌతా సుబ్బారావు(విజయవాడ) ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ ఎన్నికకు సంహరించిన మాజీ అధ్యక్షులు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి యనమండ్ర సాయీ సురేష్, కోశాధికారి శ్రీ పోతావజ్జుల పురుషోత్తమ శర్మ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘం నాయకులకు తనపై నమ్మకముంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రములో ఉన్న బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తనవంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మధుసూదన శర్మ తెలియచేసారు.
మధుసూధనశర్మ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు రాష్ట్రములోని వివిధ బ్రాహ్మణ సంఘాలు అభినందనలు తెలియచేసారు.

News
ఆదోనిలో ఘనంగా ప్రింటర్స్ డే

ఫిబ్రవరి 24 ప్రింటర్స్ డే సందర్భంగా
కర్నూలు జిల్లా ఆదోని పట్టణం బి ఎన్ టాకీస్ వెనుక ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు దేవిశెట్టి ప్రకాష్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోవిందు, కార్యదర్శి అబ్దుల్ రౌఫ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అందాలను మనసులోని భావాలను కళ్లకు కట్టినట్టు చూపించేది ఒక ప్రింటర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింటర్స్ అసోసియేషన్ సభ్యు లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

News
లారీ కింద పడి బాలుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఆదివారం ఉదయం లారీ టైర్ కింద పడి పదేళ్ల బాలుడు ఆదిత్య నారాయణ మృతి చెందాడు. ఎమ్మిగనూరు రోడ్డు కృష్ణ దేవాలయం ముందు ఘటన చోటుచేసుకుంది. మంగళవారం ఫెవరల్ పార్టీ కోసం డాన్స్ ప్రాక్టీస్ చేయడానికి తండ్రీ కొడుకు బైక్ పై వెళుతుండగా వేగంగా దూసుకు వచ్చిన లారీని తప్పించబోయి తండ్రి కొడుకులు కింద పడ్డారు కొడుకు ఆదిత్యనారాయణ పై లారీ ఎక్కడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి గురురాజు మరోవైపు పడడంతో స్వల్ప గాయాలతో క్షేమంగా ఉన్నారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
News
వేరుశనగ పొట్టు యంత్రంలో పడి కార్మికుడు మృతి

కర్నూలు జిల్లా ఆదోని శివారు మహాగౌరి ఫ్యాక్టరీ లో దారుణం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు (వేరుశనగ పొట్టు యంత్రం) కన్వేయర్ యంత్రం లో ఇరుక్కుని కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర అనే కార్మికుడు దుర్మరణం చెందాడు. కడితోట గ్రామానికి చెందిన మాల రాఘవేంద్ర , బార్య లక్ష్మి గత పదేళ్లుగా పని చేస్తున్నారు.ఇటీవలే అతనితో పాటు కుమారుడు కూడా పనిలో చేరాడు. యదావిధిగా శుక్రవారం మధ్యాహ్నం అందరూ కలిసే భోజనం చేశారు.

ఐతే త్వరగా భోజనం చేసిన రాఘవేంద్ర మిషన్ లో పొట్టు వేయడానికి వెళ్ళాడు , కాసేపటికి కుమారుడు వీరేష్ వెళ్లి చూడగా తండ్రి యంత్రంలో ఇరుక్కుని విగత జీవిగా కనిపించడంతో వెంటనే మిషన్ ఆఫ్ చేసి గట్టిగా కేకలు వేయడంతో పక్కనే ఉన్న మరికొంత మంది కూలీలు అతి కష్టం మీద రాఘవేంద్ర మృత దేహాన్ని బయటకి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బార్య లక్ష్మి పిర్యాదు మేరకు ఇస్వీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.


-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business4 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
Business3 weeks ago
ఆదోని మార్కెట్ యార్డ్ లో పత్తి ధర
-
News3 weeks ago
లారీ కింద పడి బాలుడు మృతి
-
News4 weeks ago
హత్య కేసులో ముద్దాయికి యావజ్జీవ శిక్ష