News
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులుగా వెల్లాల మధుసూధనశర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ ను బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు ఇందులో నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ, ప్రధానకార్యదర్శి పోతావజ్జుల పురుషోత్తమశర్మ(తెనాలి) , కోశాధికారిగా శ్రీ కౌతా సుబ్బారావు(విజయవాడ) ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా వెల్లాల మధుసూదన శర్మ మాట్లాడుతూ ఎన్నికకు సంహరించిన మాజీ అధ్యక్షులు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి యనమండ్ర సాయీ సురేష్, కోశాధికారి శ్రీ పోతావజ్జుల పురుషోత్తమ శర్మ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘం నాయకులకు తనపై నమ్మకముంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రములో ఉన్న బ్రాహ్మణ సమస్యల పరిష్కారానికి తనవంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మధుసూదన శర్మ తెలియచేసారు.
మధుసూధనశర్మ అధ్యక్షులుగా ఎన్నికైనందుకు రాష్ట్రములోని వివిధ బ్రాహ్మణ సంఘాలు అభినందనలు తెలియచేసారు.

News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




News
బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

News
పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.
-
News2 weeks agoఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
-
News4 weeks agoఆదోనిలో రోడ్డు ప్రమాదం – వ్యక్తి మృతి
-
News2 weeks agoపత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు
-
News4 weeks agoమత్తులో వాహనాలు నడిపితే శిక్షలు తప్పవు
-
News2 weeks agoబస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష
-
News3 weeks agoపత్తి కొనుగోలు కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు
-
News4 weeks agoఆదోని పాత బ్రిడ్జిపై నుంచి పడి వృద్ధురాలికి తీవ్రగాయాలు
-
News4 weeks agoవైఎస్ఆర్సిపి ఎస్సీ సెల్ రౌండ్ టేబుల్ సమావేశం
