News
మాల జయలక్ష్మి కి న్యాయం చేయాలి..
మాలజయలక్ష్మి కొట్టం తొలగించిన వారిపై కేసు నమోదు చేయాలి..
తాసిల్దార్ నిత్యానందయ్యను సస్పెండ్ చేయాలి..
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ ను కలిసిన వినతి పత్రం అందజేసిన చేసిన మాల మహానాడు నాయకులు..
కర్నూలు జిల్లా ఆదోనిలో సోమవారం సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఐఏఎస్ కు స్పందన కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.
అనంతరం మాల మహానాడు నాయకులు మాట్లాడుతూ నందవరం మండలం హలహరి గ్రామంలో ఆగ్రవర్ణాలు గుడిసెలను తొలగించకుండ 10 సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న దళిత మహిళా మాలజయలక్ష్మి షెడ్డు ని తొలగించడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్వో నిత్యానందయ్య పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలకి అండగా నిలబడి రాష్ట్రంలో మాలమహానాడు తరఫున ర్యాలీలు ధర్నాలు చేసి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాలమహానాడు రాష్ట్ర లీగల్ అడ్వైజర్ చంద్రయ్య మాల మహానాడు కర్నూలు జిల్లా అధ్యక్షులు జైభీమ్ సాయిరామ్, రాయలసీమ అధ్యక్షులు ఎం నరసప్ప , నందవరం మాల మహానాడు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు ఆదోని మండల యూత్ ప్రెసిడెంట్ నరేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు రాజోలప్ప మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ కుమార్మాల మహానాడు నాయకులు బన్నూరు అంజి నీలకంఠ ఎల్లప్ప హుసేని గిరి తదితరులు పాల్గొన్నారు.
News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్
కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


