News
ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ధరలు
ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు 15.05.2023

పత్తి క్వింటాల్ ధర
గరిష్టం ₹ 7538-00
మధ్యధర ₹ 7299-00
కనిష్టం ₹ 4829-00

వేరుశనగలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 7619-00
మధ్యధర ₹ 6849-00
కనిష్టం ₹ 3806-00

ఆముదాలు క్వింటాలు ధర
గరిష్టం ₹ 5485-00
మధ్యధర ₹ 5288-00
కనిష్టం ₹ 4755-00

పూల విత్తనాలు ధర
గరిష్టం ₹ 0000-00
మధ్యధర ₹ 0000-00
కనిష్టం ₹ 0000-00












News
నిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
ఆదోని నియోజకవర్గంలోని నిజాముద్దీన్ కాలనీ పరిధిలో శుక్రవారం వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఆర్. ఫయాజ్ అహ్మద్ నిజామీ ఆధ్వర్యంలో 144, 145, 146 బూత్లకు సంబంధించిన బీఎల్ఓలు, బూత్ కమిటీ సభ్యులతో కలిసి ఇంటింటికీ వెళ్లి SIR ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ప్రతి అర్హత కలిగిన ఓటరు తప్పనిసరిగా SIR ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. ఇప్పటికే చాలామంది తమ ఓటరు వివరాలను ధృవీకరించుకున్నప్పటికీ, ఇంకా కొందరు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందని తెలిపారు.

మరో 3 రోజుల్లో వెరిఫికేషన్ గడువు ముగియనున్నందున, ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా వెంటనే తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేయించుకోని వారి పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించబడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

అలాగే ప్రతి కుటుంబం తమ ఓటు హక్కును పరిరక్షించుకునే బాధ్యతతో ముందుకు రావాలని, అవసరమైతే సంబంధిత BLO, BLA లేదా ఎన్నికల అధికారులను సంప్రదించి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అమూల్యమైనదని, ప్రతి పౌరుడు తన ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
వెరిఫికేషన్ కోసం ఇప్పటికే ఉన్న ఓటర్ ఐడీ, పాత ఓటర్ వివరాలు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జత చేసి సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు ప్రజలందరూ సహకరించి, నిర్ణీత గడువులోపు తమ SIR ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.
News
కుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
కర్నూలు జిల్లా కౌతాళం మండలం గొప్పగన్ రైల్వే గేట్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని కౌతాళం మండలానికి చెందిన నర్సారెడ్డి (S/o పెట్టి రామన్న) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఆదోనికి వచ్చి తిరిగి కౌతాళం కి వెళ్తుండగా గురువారం రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యులు లారీ ఢీ ప్రమాదంలో మృతి చెందాలని ఆరోపిస్తున్నారు. కౌతాలంకి చెందిన టీడీపీ యువ నాయకుడు సురేష్ నాయుడు బాధిత కుటుంబాన్ని ఆదోని ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు.


News
ఆదోని మున్సిపల్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో ఆధార్ స్పెషల్ క్యాంపులు
ఆదోని, జూలై 07, 2026:
కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ పరిధిలోని వివిధ పాఠశాలలు మరియు కళాశాలల్లో విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. డైరెక్టర్ SGSW వారి ఉత్తర్వుల ప్రకారం.. విద్యార్థులు తమ ఆధార్ కార్డులను అప్డేట్ (MBU) చేసుకోవడానికి ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
క్యాంపుల నిర్వహణ తేదీలు & సమయం:
ఈ ప్రత్యేక క్యాంపులు మొదటి విడతగా జూలై 14, 2026 నుండి జూలై 17, 2026 వరకు, అలాగే రెండవ విడతగా జూలై 21, 2026 నుండి జూలై 24, 2026 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 05:00 గంటల వరకు ఈ కేంద్రాలు పనిచేస్తాయి.
ఆధార్ క్యాంపులు జరిగే కేంద్రాలు – సంప్రదించాల్సిన వివరాలు:
- 18వ వార్డు మున్సిపల్ ప్రైమరీ స్కూల్: వి. ప్రభాకర్ (సెల్: 8639703508)
- నోబుల్ వోకేషనల్ కాలేజ్: జి.పి. హిమ బిందు (సెల్: 7095638185)
- సాయి జూనియర్ కాలేజ్: ఎస్. దేవానంద్ (సెల్: 9642990737)
- గర్ల్స్ హైస్కూల్: జి. నాగేష్ (సెల్: 9848982361)
- అక్షర శ్రీ జూనియర్ కాలేజ్: వై. వెంకటేష్ (సెల్: 9642080186)
- ఆల్ఫా ఇంగ్లీష్ మీడియం స్కూల్: జె. రాజశేఖర్ (సెల్: 8522812267)
- గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్: ఎం. కోసిగయ్య (సెల్: 9885052859)
- బాలాజీ జూనియర్ కాలేజ్: ఎస్. నాగరాజు (సెల్: 9542486819)
ముఖ్య గమనిక:
మున్సిపల్ పరిధిలోని ఆయా విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులందరూ, తమ ఆధార్ కార్డులకు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్డేట్ (Mandatory Biometric Update – MBU) చేయించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆదోని పురపాలక సంఘం కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
-
News1 day agoఆదోని నూతన ఆర్డీవో గా బాధ్యతలు స్వీకరించిన కె. అరుణా దేవి
-
News1 day agoఆదోనిలో ఆసక్తికర ఘటన.. వైరల్గా మారిన ఎమ్మెల్యే వ్యాఖ్యలు
-
News12 hours agoకుప్పగల్ రైల్వేగేట్ సమీపంలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి..
-
News3 weeks agoసూర్యుని చుట్టూ ఒక పెద్ద వృత్తాకార వలయం
-
News2 weeks agoఅదోనిలో 30 లక్షలు విలువ చేసే 35 బైక్లు స్వాధీనం
-
News4 days agoవృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్
-
News2 weeks agoఅదోనిలో 33 లక్షల విలువ చేసే 13.5 కేజీల వెండి స్వాధీనం
-
News8 hours agoనిజాముద్దీన్ కాలనీలో SIR ఓటర్ వెరిఫికేషన్
