News
ఆదోనిలో కోడి పంద్యాల జూదగాళ్లు అరెస్ట్
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయనగర్ లో కోడి పందెము ఆడుతున్న 16 మంది జూదగాళ్లు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 72 వేల నగదు రెండు కోడిపుంజులు వన్ టౌన్ సిఐ శ్రీరామ్ సీజ్ చేశారు.
సిఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు, ఆదోని SDPO వారి పర్యవేక్షణలో వన్ టౌన్ సీఐ శ్రీ రామ్ వారి సిబ్బంది రాయనగర్లో బయలుస్థలములో డబ్బును పందెములు గా పెట్టి కోడి పందెమ్ ఆడుతున్న 16 మంది జూదగాళ్లను A1 సయ్యద్ జవీద్ బాష, A2 గుంటన్న, A3 చూడిఫారోష్ టిప్పు సుల్తాన్, A4 చాకలి వీరేష్, A5 భీమ శేఖర్, A6 P.G. మాధవ, A7 షికిల్ ఘర్ షాషావలి @ JBL షాషా, A8 బెస్త శ్రీనివాసులు @ కొళ్ళ సీన, A19 M. లతీఫ్ @ లతీఫ్ బాష, A10 ఫాణిభన్ షంషుద్దీన్, A11 ముల్లా షాషా, A12 షేక్ ఇస్మాయిల్, A13 బెస్త రామాంజినేయులు @ ప్లంబర్ అంజి, A14 అబ్దుల్ గఫూర్, A15 మహబూబ్ బాష @ సల్మాన్ @ షేక్ మహబూబ్ బాషా, A16 తెలుగు శ్రీనివాసులు @ సెంట్రింగ్ సీన లను అరెస్టు చేసి Rs. 72,000/- నగదు మరియు 02 కోడి పుంజులను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వారిపై 9(1) APG Act (Cock Fight) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నాట్లు సిఐ శ్రీరామ్ తెలిపారు.
News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




