News
దళిత మహిళపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలి
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దాడికి గురైన దళిత మహిళ గోవిందమ్మను ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మరియు ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ తదితరులు ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గోవిందమ్మను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆదోని సబ్ డివిజనల్ SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఎరుకల రవికుమార్ మాట్లాడుతూ ప్రేమవివాహం కారణంగా అబ్బాయి తల్లిని, అమ్మాయి యొక్క కుటుంబ సభ్యులు గ్రామంలో ఉంటున్న గోవిందమ్మను ఈడ్చుకెల్లి వివస్త్రను చేసి స్థంభానికి కట్టేసి కొట్టి హింసించడం అనేది చాలా దారుణం అని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది మానవ సమాజానికి సిగ్గుచేటు అని తెలిపారు. ఈ విషయంలో మన రాష్ట్ర హోంమంత్రి ఒక దళిత మహిళ కాబట్టి వెంటనే స్పందించాలని కోరారు. సంఘటన జరిగిన ప్రదేశాన్ని సందర్శించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళితులపై దాడులు ల్ పునరావృతం కాకుండా చట్టాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. దళిత మహిళ పై దాడికి పాల్పడిన ముద్దాయిలకు శిక్షలు పడేంతవరకు పోరాడుతామని తెలిపారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎరుకల హక్కుల పోరాట సమితి జిల్లా అద్యక్షులు ఎరుకల కృష్ణ, వీరేశ్, మాల నాగేంద్ర, తదితరులు పాల్గొన్నరు.

News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




