News
దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి

కర్నూలు జిల్లా ఆదోని ( మం) నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసిపి పార్టీ కి చెందిన గుండమ్మ (45) అనే దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి చేసి , గుండమ్మ తరపున అడ్డొచ్చిన పురుషోత్తమ రెడ్డి పై దాడి చేసిన రాఘవేంద్ర రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి , ఆతని అనుచరులు పరారీ లో ఉన్నారు.
ఈ ఘటనలో గుండమ్మ అక్కడిక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు.

సర్వే నెంబర్ 500d లో 4 ఎకరాలు భూమి నీ 2019 లో రాఘవేంద్ర రెడ్డి (రాఘప్ప ) చిన్నమ్మ తిరుమలమ్మ తో గుండమ్మ కొనుగోలు చేసింది. అదే పొలాన్ని తిరుమలమ్మ భర్త లేట్ సోమశేఖర్ రెడ్డి తమకు అమ్ముడానికి అగ్రిమెంట్ చేసి మృతి చెందారని , అదే పొలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని తరచూ గుండమ్మ తో రాఘవేంద్ర రెడ్డి గొడవపడేవారు అందులో భాగంగానే పొలం దున్నే విషయంలో ఇరువురు గత 5 ఏళ్లుగా గొడవ పడుతున్నారు.

గతంలో వైసిపి అధికారంలో ఉండటంతో గమ్మున ఉన్న రాఘవేంద్ర రెడ్డి టీడీపీ అధికారంలో రావడంతో శుక్రవారం ఆదోని కల్లుబావికి చెందిన పురుషోత్తమ రెడ్డి సహకారంతో పొలం దున్నడానికి వెళ్లిన గుండమ్మ పై రాఘవేంద్ర రెడ్డి ప్రోద్బలంతో అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ట్రాక్టర్ తో గుద్ది, అడ్డొచ్చిన పురుషోత్తం రెడ్డి పై దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో గుండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా , పురుషోత్తమ రెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని మరియు పురుషోత్తమ రెడ్డి నీ ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే ఆదోని తాలూకా పోలీసులు గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


News
శుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే లక్ష్యం.. కౌన్సిలర్ ఫయాజ్

కర్నూలు జిల్లా ఆదోని నిజాముద్దీన్ కాలనీలో ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ సిబ్బంది చంద్ర, లైన్మాన్ సింగ్, మేస్త్రీ మహేష్ త్రాగునీటిలో క్లోరిన్ శాతాన్ని పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ మాట్లాడుతూ నీటిలో క్లోరిన్ స్థాయి 1.0 పిపిఎంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మున్సిపాలిటీ తరపున ప్రతిదినం నీటి పరీక్షలు నిర్వహించి ప్రజారోగ్య రక్షణకు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు.


News
16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.


News
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.


-
News2 weeks ago
శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా
-
News3 weeks ago
భారీ వర్షనికి రామజల చెరువు నిండి ఇళ్లలోకి నీరు
-
News3 weeks ago
తుంగభద్ర డ్యాంకు పెరుగుతున్న వరద నీరు 27-09-2025
-
News3 weeks ago
ఆదోని డివిజన్లో కురిసిన వర్షపాతం
-
Business3 weeks ago
రోజు రోజుకు పతనమవుతున్న పత్తి ధర..
-
Business4 weeks ago
Gold, Silver Price బంగారు ధర
-
Business4 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు
-
Business3 weeks ago
వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు