Connect with us

News

దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని ( మం) నాగనాథన హల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వైసిపి పార్టీ కి చెందిన గుండమ్మ (45) అనే దళిత మహిళ పై ట్రాక్టర్ తో దాడి చేసి , గుండమ్మ తరపున అడ్డొచ్చిన పురుషోత్తమ రెడ్డి పై దాడి చేసిన రాఘవేంద్ర రెడ్డి కొడుకు శ్రీకాంత్ రెడ్డి , ఆతని అనుచరులు పరారీ లో ఉన్నారు.
ఈ ఘటనలో గుండమ్మ అక్కడిక్కడే మృతి చెందగా పురుషోత్తం రెడ్డికి తీవ్ర గాయాలు.

మృతురాల దగ్గర గ్రామస్తులు పోలీసులు

సర్వే నెంబర్ 500d లో 4 ఎకరాలు భూమి నీ 2019 లో రాఘవేంద్ర రెడ్డి (రాఘప్ప ) చిన్నమ్మ తిరుమలమ్మ తో గుండమ్మ కొనుగోలు చేసింది. అదే పొలాన్ని తిరుమలమ్మ భర్త లేట్ సోమశేఖర్ రెడ్డి తమకు అమ్ముడానికి అగ్రిమెంట్ చేసి మృతి చెందారని , అదే పొలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారని తరచూ గుండమ్మ తో రాఘవేంద్ర రెడ్డి గొడవపడేవారు అందులో భాగంగానే పొలం దున్నే విషయంలో ఇరువురు గత 5 ఏళ్లుగా గొడవ పడుతున్నారు.

హత్యకు వాడిన ట్రాక్టర్

గతంలో వైసిపి అధికారంలో ఉండటంతో గమ్మున ఉన్న రాఘవేంద్ర రెడ్డి టీడీపీ అధికారంలో రావడంతో శుక్రవారం ఆదోని కల్లుబావికి చెందిన పురుషోత్తమ రెడ్డి సహకారంతో పొలం దున్నడానికి వెళ్లిన గుండమ్మ పై రాఘవేంద్ర రెడ్డి ప్రోద్బలంతో అతని కుమారుడు శ్రీకాంత్ రెడ్డి ట్రాక్టర్ తో గుద్ది, అడ్డొచ్చిన పురుషోత్తం రెడ్డి పై దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో గుండమ్మ అక్కడికక్కడే మృతి చెందగా , పురుషోత్తమ రెడ్డి కి తీవ్ర గాయాలయ్యాయి. మృతురాలిని మరియు పురుషోత్తమ రెడ్డి నీ ఆదోని జనరల్ ఆసుపత్రికి తరలించారు.

హత్యకు గురైన గుండమ్మ

ఈ ఘటన జరిగిన వెంటనే ఆదోని తాలూకా పోలీసులు గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గ్రామంలో ప్రజలు
ఘర్షణలో గాయపడిన కలుబావి పురుషోత్తం రెడ్డి
Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 04 06 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

04 06 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement
Continue Reading

News

ఆదోనిలో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు

Published

on

By

ఆదోని 03 06 25:

రైతు బజార్లో ఈరోజు కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 16/- రూపాయలు, రిటైల్: 1kg 18/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 22/- రూపాయలు, రిటైల్: 1kg 24/- రూపాయలు

03 06 25 రైతు బజార్ ధరల పట్టిక
Advertisement
Continue Reading

News

రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ

Published

on

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదోని మండలం లోని గ్రామాల రైతు సోదరులకు ప్రభుత్వ రాయితీ ద్వారా వేరుశనగ పంపిణీ చేస్తుందని రైతు సేవ కేంద్రాలలో రాయితీ వేరుశనగ కోసం రైతులు తమ ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వేరు శనగ విత్తనాలు (K 6) రకం కావాల్సిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందవచ్చని ఒక రైతుకు ఎకరాల ప్రకారం (0.5 ఎకరాలకు 1 బ్యాగు, 2 ఎకరాలకు 03బ్యాగులు) గరిష్టంగా 3 బ్యాగుల వరకు ఇస్తున్నట్లు తెలిపారు, ఒక బ్యాగు బరువు 30 కేజీలు. ఉంటుందని వేరు శనగ క్వింటాలు ధర 9300/- కు, ప్రభుత్వ రాయితీ  3720/- రైతు వాటా 5580/- కట్టాలని అన్నారు.

రాయితీ వేరుశనగ అందిస్తున్న ఫోటో
రాయితీ వేరుశనగ
Continue Reading
News2 days ago

ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం

News5 days ago

కౌతాళం మండలం లో దారుణం

News4 days ago

క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం

News4 weeks ago

భారత్‌-పాక్‌ యుద్ధంపై ట్రంప్‌ సంచలన ప్రకటన

News2 weeks ago

ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్‌గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక

News2 days ago

ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి

News2 days ago

రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ

News3 days ago

వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి

News3 weeks ago

వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్

News3 weeks ago

శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని  సిపిఎం పార్టీ పాదయాత్ర

Trending