News
సోడా సీసాలతో దాడి
ఆదోనిలో ట్రాఫిక్ సమస్య వలన రోడ్లపై వాహనదారులు, తోపుడు బండ్ల వ్యాపారుల మధ్య గొడవలు జరుగుతున్నా. రోడ్డుపై అడ్డంగా ఆపుకొని వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా వాదించి వారితో గొడవలకు దిగుతున్నారు.

ఆదోని మండలం సర్పంచ్ లక్ష్మన్న సోదరుడు నాగార్జున అనే వ్యక్తి తెలిపిన వివరాలు ఇలా వున్నాయి
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం రైతుబజార్ వద్ద పంపు మోటార్ రిపేరు కోసం కారులో వచ్చిన వ్యక్తి రోడ్డుపై అడ్డంగా ఆపిన సోడాబండి తీయాలని చెప్పి ఎన్ని సార్లు హార్న్ కొట్టినా పట్టించుకోకుండా వ్యాపారం సాగిస్తుండడంతో కారు దిగి సోడా బండి వ్యక్తి తో వాగ్వాదానికి దిగాడు. ఈ వాగ్వాదం కాస్త ముదిరి ఘర్షణగా మారి ఒకరి పై ఒకరు సోడా సీసాలతో కొట్టుకున్నారు. ఇద్దరికీ గాయాలు కావడంతో ఆదోని GGh కు తరలించారు.

ఈ ఘటనపై 2 వ పట్టణ పోలీసులు నాగార్జున , శ్రీనివాస్ ఇద్దరినీ విచారిస్తున్నారు.


News
ఆదోని రైతు బజార్లో కూరగాయల హోల్సేల్, రిటైల్ ధరలు
ఆదోని 09-01-2026:
కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో శుక్రవారం కూరగాయల హోల్సేల్ మరియు రిటైల్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. టమాట హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయల ఉల్లి గడ్డలు హోల్సేల్ 1kg. 18/- రూపాయలు, రిటైల్: 1kg 20/- రూపాయలు


News
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక
వైసీపీ రాష్ట్ర లీగల్ సెల్ సెక్రటరీగా ఆదోనికి చెందిన అడ్వకేట్ జీవన్ సింగ్ ఎంపిక కావడంపై ఆదోని న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నియామకానికి సహకరించిన ఆదోని మాజీ ఎమ్మెల్యే వై. సాయి ప్రసాద్ రెడ్డికి జీవన్ సింగ్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆదోని న్యాయవాదులు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని జీవన్ సింగ్ స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తే సహించేది లేదని, చట్టపరంగా బలమైన పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.వైసీపీ లీగల్ సెల్ను మరింత బలోపేతం చేసి పార్టీ శ్రేణులకు న్యాయ సహాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జీవన్ సింగ్ పేర్కొన్నారు.
News
కాటన్ అండ్ జిన్నింగ్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం
కర్నూలు జిల్లా ఆదోని శివారు బసపురం రోడ్డు లో హరి కాటన్ & జిన్నింగ్ ఫ్యాక్టరీ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చెలరేగిన మంటలు మంటల్లో పత్తి బేలు కాలి బూడిద అయ్యాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని హరి యాదవ్ తెలిపారు.




