News
ఏపీలో 19 మంది ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్ అధికారులు కూడా బదిలీ అయ్యారు.
విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా హరీశ్ కుమార్ గుప్తా,
హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్ విశ్వజిత్ నియమితుల య్యారు.
3)జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
4)ఆర్.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్
5)జి.జయలక్ష్మి- సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్గా బాధ్యతలు
6)కాంతిలాల్ దండే- ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ
7)సురేశ్ కుమార్- పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి
8)సురేశ్ కుమార్- గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు
9)జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్కు అదనపు బాధ్యతలు
10)సౌరభ్ గౌర్- ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు
11)యువరాజ్- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి
12)హర్షవర్ధన్- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు
13)పి.భాస్కర్- వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి
14)పి.భాస్కర్- ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు
15)కె.కన్నబాబు- సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి
16)గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్గానూ బాధ్యతలు
17)వినయ్చంద్- పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ
వివేక్ యాదవ్- యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి సూర్యకుమారి- మహిళా, శిశుసంక్షేమం, దివ్వాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ
– సి.శ్రీధర్- ఇండస్ట్రీస్ డైరెక్టర్గా బాధ్యతలు
– జె.నివాస్- ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్
– విజయరామరాజు- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా పోస్టింగ్
– హిమాంశు శుక్లా- సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్
– ఢిల్లీరావు- వ్యవసాయశాఖ డైరెక్టర్గా పోస్టింగ్
– వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్ను బదిలీ
– గిరిజాశంకర్- ఆర్థికశాఖ నుంచి రిలీవ్ అయ్యారు.
News
రైతులకు రాయితీ వేరుశనగ పంపిణీ

కర్నూలు జిల్లా ఆదోని వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆదోని మండలం లోని గ్రామాల రైతు సోదరులకు ప్రభుత్వ రాయితీ ద్వారా వేరుశనగ పంపిణీ చేస్తుందని రైతు సేవ కేంద్రాలలో రాయితీ వేరుశనగ కోసం రైతులు తమ ఆధార్ కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. వేరు శనగ విత్తనాలు (K 6) రకం కావాల్సిన రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని విత్తనాలు పొందవచ్చని ఒక రైతుకు ఎకరాల ప్రకారం (0.5 ఎకరాలకు 1 బ్యాగు, 2 ఎకరాలకు 03బ్యాగులు) గరిష్టంగా 3 బ్యాగుల వరకు ఇస్తున్నట్లు తెలిపారు, ఒక బ్యాగు బరువు 30 కేజీలు. ఉంటుందని వేరు శనగ క్వింటాలు ధర 9300/- కు, ప్రభుత్వ రాయితీ 3720/- రైతు వాటా 5580/- కట్టాలని అన్నారు.


News
ఎరువుల అక్రమ రవాణా పై ఉక్కు పాదం

కర్నూలు జిల్లా ఆదోనిలో సిరుగుప్ప టర్నింగ్ వద్ద వ్యవసాయ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ అధికారి అశోక్ కుమార్ తెలిపిన వివరాల ఎలా ఉన్నాయి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా ఎరువుల రవాణా చేస్తున్నారని సమాచారంతో సోమవారం అక్రమ రవాణాను అరికట్టుడాం కోసం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి పి. ఎల్. వరలక్ష్మి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బృందాలను బృందాలుగా ఏర్పడి శిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈ తనిఖీలో వ్యవసాయ శాఖ వ్యవసాయ సహాయ సంచాలకులు బి.బాలవర్ధి రాజు, వ్యవసాయ అధికారి సి. అశోక్ కుమార్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఆర్ ఐ పెద్దయ్య పాల్గొన్నారు.


News
మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలి

కర్నూలు జిల్లా ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు విద్యార్థి సంఘం నాయకులు మెడికల్ కాలేజ్ పనులు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్, DSF జిల్లా అధ్యక్షుడు దనాపురం ఉదయ్ PSA రాష్ట్ర అధ్యక్షుడు రాజు SSA రాష్ట్ర కార్యదర్శి శివ ప్రసాద్ గౌడ్ PDSO డివిజన్ కార్యదర్శి శివ మాట్లాడుతూ. మెడికల్ కళాశాల పై కూటమి ప్రభుత్వం నిర్లక్షం వీడలని ఆదోని మెడికల్ కళాశాల అర్ధాంతరంగా పనులు నిలిపేసి కూటమి ప్రభుత్వం 66 సంవత్సరాలకు లీజుకి ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్య ప్రజలకు సరైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేశారని కొనియాడారు. కానీ కూటమి ప్రభుత్వం విద్యార్థుల కడుపులు కొడుతూ ప్రైవేట్ పరం చేస్తూ PPP పద్ధతిలో కొనసాగిస్తామని ప్రభుత్వ నిర్ణయం సరైన పద్ధతి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధీనంలోనే మెడికల్ కళాశాలను కొనసాగించాలని విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
-
News4 days ago
కౌతాళం మండలం లో దారుణం
-
News2 days ago
క్రికెట్ బెట్టింగ్ లో 91 లక్షల నగదు స్వాధీనం
-
News3 weeks ago
భారత్-పాక్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన
-
News2 weeks ago
ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్గా లోకేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక
-
News4 hours ago
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సుల యాజమాన్యం పై చర్యలు తీసుకోండి
-
News3 weeks ago
వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్
-
News1 day ago
వెన్నుపోటు దినం పోస్టర్ విడుదల చేసిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
-
News3 weeks ago
శాశ్వతంగా త్రాగునీటి పరిష్కరించాలని సిపిఎం పార్టీ పాదయాత్ర