Connect with us

News

ఏపీలో 19 మంది ఐఏఎస్ ఇద్దరు ఐపీఎస్ అధికారుల బదిలీలు

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

వీరితో పాటు ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు కూడా బదిలీ అయ్యారు.

విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా హరీశ్‌ కుమార్‌ గుప్తా,

హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా కుమార్‌ విశ్వజిత్‌ నియమితుల య్యారు.

3)జి.అనంతరాము- అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

4)ఆర్‌.పి. సిసోడియా- స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్‌

5)జి.జయలక్ష్మి- సీసీఎల్‌ఏ చీఫ్‌ కమిషనర్‌గా బాధ్యతలు

6)కాంతిలాల్‌ దండే- ఆర్‌ అండ్‌ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ

7)సురేశ్‌ కుమార్‌- పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి

8)సురేశ్‌ కుమార్‌- గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు

9)జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు

10)సౌరభ్‌ గౌర్‌- ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు

11)యువరాజ్‌- పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ కార్యదర్శి

12)హర్షవర్ధన్‌- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు

13)పి.భాస్కర్‌- వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి

14)పి.భాస్కర్‌- ఈడబ్ల్యూఎస్‌, జీఏడీ సర్వీసెస్‌ అదనపు బాధ్యతలు

15)కె.కన్నబాబు- సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి

16)గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌గానూ బాధ్యతలు

17)వినయ్‌చంద్‌- పర్యాటకశాఖ కార్యదర్శిగా బదిలీ

వివేక్ యాదవ్‌- యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శి సూర్యకుమారి- మహిళా, శిశుసంక్షేమం, దివ్వాంగుల సంక్షేమ కార్యదర్శిగా బదిలీ

– సి.శ్రీధర్‌- ఇండస్ట్రీస్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు

– జె.నివాస్‌- ఆర్థికశాఖ అదనపు కార్యదర్శిగా పోస్టింగ్‌

– విజయరామరాజు- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌

– హిమాంశు శుక్లా- సమాచార, పౌర సంబంధాలశాఖ డైరెక్టర్‌

– ఢిల్లీరావు- వ్యవసాయశాఖ డైరెక్టర్‌గా పోస్టింగ్‌

– వ్యవసాయశాఖ నుంచి హరికిరణ్‌ను బదిలీ

– గిరిజాశంకర్‌- ఆర్థికశాఖ నుంచి రిలీవ్ అయ్యారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

16 లక్షలతో రోడ్లు, డ్రైనేజ్ పనులు పూర్తి

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ 33వ వార్డు, టిజిఎల్ కాలనీలో దాదాపు 16 లక్షల రూపాయల జనరల్ ఫండ్ ద్వారా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుట పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ వాల్మీకి కొండారెడ్డి కీర్తన, వాల్మీకి కొండారెడ్డి కిషోర్ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమం ద్వారా ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని తెలిపారు. పనులు సమయానికి పూర్తి చేసినందుకు మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు, కాంట్రాక్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అభివృద్ధి పనులు ప్రజల జీవితాలను మరింత మెరుగుపరచడంలో తోడ్పడుతుందని తెలిపారు. ప్రజల అభివృద్ధికి మరింతగా సేవలు అందించడంపై కట్టుబడనున్నామని అదే విధంగా, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఆవశ్యకమైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు.

పూర్తయిన కాలువలు
పూర్తి చేసిన రోడ్డు పనులు
Continue Reading

News

శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శివారు బాబా ఫరీద్ దర్గా వద్ద శ్రీనివాస ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఆదోనికి చెందిన శ్రీనివాస ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుండి ఆదోని కు వస్తున్న సమయంలో ఉదయం5 గంటలకు ఎమ్మిగనూరు దగ్గర బాబా ఫరిద్ సాబ్ దర్గా సమీపంలో  ఓవర్ టెక్ చెయ్యబోయి బస్సు బోల్తా కొట్టింది. స్వల్ప గాయాలతో 13 మంది ప్రయాణికులు ప్రయాణికులు  బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో పోలీసులు విచారణ చేపట్టారు.

అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
అదుపుతప్పి బోల్తా పడిన బస్సు
Continue Reading

News

తుంగభద్ర డ్యాం నీటి నిలువల వివరాలు 29-09-2025

Published

on

తుంగభద్ర డ్యాం అధికారులు తెలిపిన నీటి నిలువల వివరాలు ఇలాఉన్నాయి.
పూర్తి స్దాయి నీటిమట్టం 1633.00 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం : 1626.06 అడుగులు
పూర్తిస్థాయి నీటి నిల్వ : 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ : 80.003 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 15429 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 15327 క్యూసెక్కులు

హైడ్రాలిక్ పైపుల అడ్వర్టైజ్మెంట్
Continue Reading

Trending