Connect with us

News

కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై పోలీసుల ఉక్కు పాదం

Published

on

కర్నూలు జిల్లా ఆదోని మండలములో కర్ణాటక మద్యం అక్రమ రవాణా మరియు అమ్మే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించరు పోలీసులు. ఈ డ్రైవ్ లో వేరువేరు ప్రాంతాల నుంచి 6 మంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 14 మద్యం బాక్సులు ఒక ఆటో ఒక స్కూటర్ స్వాధీనం చేసుకుని వారిని రిమైండ్ కి తరలించినట్లు ట్రైనింగ్ డిఎస్పి ధీరజ్ విలేకరులకు సమాచారం ఇచ్చారు.

యూట్యూబ్ వీడియో

వివరాల్లోకెళ్తే…
సంతేకుడ్లూరు గ్రామ బస్టాప్ వద్ద ఆస్పరి మండలము, కారుమంచి గ్రామానికి చెందిన బోయ ఆరేకంటి భీమలింగ, చెన్నప్ప లు కర్ణాటక రాష్ట్రం నాగరహళ్ గ్రామములోని వైన్ షాప్ లో 06 లిక్కర్ బాక్సుల ను కొనుగోలు చేసి వాటిని AP-39-UK-6408 ఆటోలో తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేశారు.

మాధవరం రోడ్డులోని కోసిగి క్రాస్ వద్ద కోసిగి గ్రామానికి చెందిన గోపాల్, లక్ష్మీకాంత్ లు 06 లిక్కర్ బాక్సుల AP-21-S-0246 (TVS Star Sport)మోటార్ సైకిల్ పై పెట్టుకొని పెద్దతుంబలం గ్రామానికి చెందిన రాజేష్ కు అమ్మాలని వెళ్తుండగా పట్టుకొని సీజ్ చేశారు.

పెద్దతుంబలం గ్రామములోని బోయ గోవిందు అనె వ్యక్తి తన ఇంటి మద్యం అముతూ పట్టబడ్డాడు అతని అరెస్టు చేసి 02 లిక్కర్ బాక్సులను సీజ్ చేశారు.

సీజ్ చేసిన మద్యం మరియు ఆటో ను చూపిస్తున్న పోలీసులు

కర్నూలు జిల్లా ఎస్పీ కాంత్ IPS, I/C Addl .SP, SEB జి.నాగరాజు ఆదేశాల మేరకు ఆదోని డి.ఎస్.పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో అక్రమ కర్ణాటక మద్యం అదుపు చేయడానికి ఈ దాడులు నిర్వహించినట్లు ఆదోని రూరల్ సర్కిల్ ఇంచార్జ్ ట్రైనీ DSP ధీరజ్ తెలిపారు.
ఈ దాడుల్లో ఆదోని రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ G. నిరంజన్ రెడ్డి మరియు ఇస్వీ పోలీసు స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ K.శ్రీనివాసులు, పెద్దతుంబలం పోలీసు స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ చిన్న పీరయ్య మరియు వారి సిబ్బంది కలసి పాల్గొన్నారు.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

News

బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష

Published

on

కర్నూలు జిల్లా ఆదోని కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట ఇద్దరు స్లీపర్ బస్ డ్రైవర్లకు 15 రోజులు జైలు శిక్ష విధించరు. టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి సోమవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్న సమయంలో బళ్లారి నుండి హైదరాబాద్ వెళుతున్న గీతా ట్రావెల్స్ మరియు ఐ.వి.ఆర్.ఎస్ ట్రావెల్స్ స్లీపర్ బస్సులకు డ్రైవర్లకు పోలీసులు టెస్టులు నిర్వహించరు. బ్రీత్ అనలైజర్ ద్వారా చెక్ చేసి వారిని డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఇద్దరు డ్రైవర్లని పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచరు. స్లీపర్ బస్సు డ్రైవర్లు గణేష్ కు 15 రోజులు, సుధీర్ కు 7 రోజులు, ఒక ద్విచక్ర వాహనం దారుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించారు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్.

డ్రైవర్లను కోర్టు నుంచి జైలుకు తీసుకు వెళ్తున్న పోలీసులు
Continue Reading

News

పత్తికొండలో ఏసీబీ అధికారుల దాడులు

Published

on

కర్నూలు జిల్లా పత్తికొండలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దేవనకొండ మండలం నల్లచెల్లిమిల వీఆర్వో అశోక్ రైతు నుండి 40000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నరు. ఆర్మీ రిటైర్డ్ జవాన్ శివకుమార్ తన తల్లి పేరునా ఉన్న భూమిని మార్చాలని అప్లికేషన్ పెట్టడంతో విఆర్వో లంచం డిమాండ్ చేశాడు. ఆర్మీ జవాన్ ఏసీబీ అధికారులను ఆశ్రయించరు. కర్నూలు ఏసీబీ డిఎస్పి సోమన్న పత్తికొండ లోని నెట్ సెంటర్లో రైతు నుండి పొలం పాస్ బుక్ ముటేషన్ కోసం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నరు.

Continue Reading

News

ఆదోని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Published

on

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు (మం) కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారు జామున 4 గంటలకు షిఫ్ట్ డిజైర్, ఫార్చునర్ ఢీకొనడంతో షిఫ్ట్ డిజైర్లో ఉన్న  ఐదు మంది కర్ణాటక వాసులు మృతి చెందారు.

ఫార్చునర్ లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. మృతులంతా కర్ణాటక కోలార్ జిల్లా బంగారు పేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన వరిలో ఒకే కుటుంబానికి చెందిన బార్య మీనాక్షి భర్త సతీష్ కుమార్ కుమారుడు రుతిక్ మామ వెంకటేష్ అప్ప  బంధువుల పిల్లోడు బనిత్ గౌడ్ మృతి చెందారు. అత్త గంగమ్మ, డ్రైవర్ చేతన్ ఇద్దరు తీవ్రగాయాలతో ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పొందుతున్నారు.

ప్రమాదానికి గురైన కారు
ప్రమాదానికి గురైన కారు
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఫార్చునర్ కార్ లో ఉన్న నలుగురికి బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆదోనిలో ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో  చికిత్స పొందుతున్నారు. ఫార్చునర్ కార్ లో ఉన్న అశోక్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఆదోనిలో వారి బంధువుల రిసెప్షన్ హైదరాబాదు నుంచి ఆదోని వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని తెలిపారు.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
పరిశీలిస్తున్న పోలీసులు
Continue Reading

Trending